Virat Kohli: జట్టుని వీడి లండన్ వెళ్లిపోయిన విరాట్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిగ్ షాకిచ్చాడు. టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వచ్చినట్టే వచ్చి స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో ఏమైందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli

Virat Kohli

Virat Kohli: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిగ్ షాకిచ్చాడు. టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వచ్చినట్టే వచ్చి స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో ఏమైందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగానే విరాట్ ఇండియా వచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.

విరాట్ కోహ్లీ ముందుగా ప్లాన్ చేసిన లండన్ ట్రిప్‌కి వెళ్లాడట. ఈ విషయం బీసీసీఐ కి ముందే తెలుసట. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ షెడ్యూల్ గురించి టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలుసని చెప్పారు. అతని లండన్ పర్యటన ముందే ఫిక్స్ అయినట్టు చెప్పాడు. దీంతో విరాట్ జట్టుని వీడడానికి అసలు కారణం రివీల్ అయింది.

కోహ్లి డిసెంబర్ 15న భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు బయల్దేరి, ఆ తర్వాత మూడు రోజులు జట్టుతోనే ఉండి డిసెంబర్ 19న లండన్ వెళ్లిపోయాడని బీసీసీఐ సీనియర్ అధికారి సమాచారం ఇచ్చారు.

Also Read: AP News: ఏపీలో ఎన్నికల హీట్..ఈసీ రివ్యూ

  Last Updated: 24 Dec 2023, 09:43 AM IST