Virat Kohli Cry: 18 ఏళ్లుగా కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు ఇవీ.. వీడియో వైరల్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ మైదానం మధ్యలో చివరి బంతి పడకముందే కన్నీళ్లతో కనిపించాడు.

Published By: HashtagU Telugu Desk
Bengaluru Stampede

Bengaluru Stampede

Virat Kohli Cry: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ మైదానం మధ్యలో చివరి బంతి పడకముందే కన్నీళ్లతో (Virat Kohli Cry) కనిపించాడు. విరాట్ కోహ్లీ కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందిన సందర్భంగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత విరాట్.. అనుష్కను హత్తుకుని కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.

17 సంవత్సరాల దీర్ఘకాల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. RCB.. పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఐపీఎల్ ట్రోఫీని మొదటిసారి కైవసం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో విరాట్ కోహ్లీ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. మ్యాచ్ ముగియడానికి రెండు మూడు బంతుల ముందు కోహ్లీ చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. చివరి బంతితో కోహ్లీ మైదానం మధ్యలో మోకాళ్లపై కూర్చుని, తల వంచి తీవ్రంగా ఏడవడం మొదలెట్టాడు. పంజాబ్ కింగ్స్ లక్ష్యం కంటే 6 పరుగులు వెనుకబడి ఉంది. కోహ్లీ ఈ టైటిల్ మ్యాచ్‌లో బ్యాట్‌తో 43 పరుగులు సాధించాడు.

Also Read: Royal Challengers Bengaluru: 18 ఏళ్ల ఆర్సీబీ కల సాకారం.. ఐపీఎల్ 2025 విజేతగా బెంగ‌ళూరు!

ఏడ్చిన కోహ్లీ

చివరి ఓవర్‌లో పంజాబ్ కింగ్స్‌కు గెలవడానికి 29 రన్లు అవసరం. ఓవర్ మొదటి బంతికి రన్ రాలేదు. ఆ తర్వాత హేజెల్‌వుడ్ రెండో బంతిని డాట్ బాల్ వేశాడు. ఈ బంతితో RCB ఐపీఎల్ 2025 చాంపియన్ అవుతుందని నిర్ధారణ అయింది. RCB చాంపియన్‌గా నిలిచిన వెంటనే విరాట్ కోహ్లీ తన భావోద్వేగాలను అదుపు చేయలేకపోయాడు. కోహ్లీ చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ మోకాళ్లపై కూర్చుని, తలను మైదానంపై ఉంచి చాలా సేపు ఏడ్చాడు. RCB ఇతర ఆటగాళ్లు కోహ్లీని ఓదార్చారు. ఆ తర్వాత మొత్తం RCB శిబిరం గెలుపు ఉత్సవంలో మునిగిపోయింది.

  Last Updated: 04 Jun 2025, 12:14 AM IST