Virat Kohli- Ruturaj Gaikwad: సచిన్- దినేష్ కార్తీక్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ-గైక్వాడ్!

దీనికి ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్- దినేష్ కార్తీక్ పేరు మీద ఉండేది. వీరిద్దరూ 2010లో గ్వాలియర్‌లో జరిగిన మ్యాచ్‌లో 194 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli- Ruturaj Gaikwad

Virat Kohli- Ruturaj Gaikwad

Virat Kohli- Ruturaj Gaikwad: భారత్- దక్షిణాఫ్రికా రెండో వన్డే మ్యాచ్‌లో తలపడుతున్నాయి. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 358 పరుగులు చేసింది. భారత్ తరఫున విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ (Virat Kohli- Ruturaj Gaikwad) శతకాలు సాధించారు. వీరిద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో విరాట్, గైక్వాడ్ కలిసి సచిన్ టెండూల్కర్- దినేష్ కార్తీక్ రికార్డును బద్దలు కొట్టారు. సచిన్, కార్తీక్ 15 సంవత్సరాల క్రితం గ్వాలియర్‌లో ఈ ఘనత సాధించారు.

విరాట్, గైక్వాడ్‌ల‌ భారీ ఘనత

ఈ మ్యాచ్‌లో భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. యశస్వి జైస్వాల్ 38 బంతుల్లో 22, రోహిత్ శర్మ 8 బంతుల్లో 14 పరుగులు చేసి నిష్క్రమించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఇద్దరూ శతకాలు సాధించారు. గైక్వాడ్ 83 బంతుల్లో 105 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, విరాట్ 93 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున వన్డేలలో అతిపెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

Also Read: Blood Pressure: మీకు బీపీ సమస్య ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!!

దీనికి ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్- దినేష్ కార్తీక్ పేరు మీద ఉండేది. వీరిద్దరూ 2010లో గ్వాలియర్‌లో జరిగిన మ్యాచ్‌లో 194 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక దక్షిణాఫ్రికాపై మూడో అతిపెద్ద భాగస్వామ్యాన్ని 2001లో సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి 193 పరుగులు చేశారు.

దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన బ్యాట్స్‌మెన్

  • 195 ప‌రుగులు- విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ (రాయ్‌పూర్, 2025)
  • 194 ప‌రుగులు- సచిన్ టెండూల్కర్- దినేష్ కార్తీక్ (గ్వాలియర్, 2010)
  • 193 ప‌రుగులు- సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ (జోహన్నెస్‌బర్గ్, 2001)

భారత్ 50 ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ శతకాలతో పాటు కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 43 బంతుల్లో 66 పరుగులు చేసి భారత్ స్కోరును 5 వికెట్ల నష్టానికి 358 పరుగులకు చేర్చాడు.

  Last Updated: 03 Dec 2025, 09:37 PM IST