Site icon HashtagU Telugu

Vinesh Phogat: అనర్హత వేటు.. తొలిసారి స్పందించిన వినేశ్ ఫొగట్

Vinesh Phogat Resigns Railways

Vinesh Phogat Resigns Railways

Vinesh Phogat: భారత స్టార్ అథ్లెట్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) ఫైనల్ మ్యాచ్‌కు ముందే అనర్హులుగా టోర్నీ నుంచి వైదొలిగింది. దీంతో ఆమె కల, కోట్లాది మంది భారతీయుల కల చెదిరిపోయింది. ఫోగాట్ త‌న విభాగంలో ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు పెరిగింది. దీంతో ఆమె నిర్ణీత ప్రమాణాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆమె పతకం తీసుకోకుండానే పారిస్ నుంచి తిరిగి రానుంది. ఈ ఘటన తర్వాత వినేష్‌ను ఆస్పత్రిలో చేర్చారు. వినేష్ డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

వినేష్ ఫోగట్ కేసుపై దుమారం రేగుతోంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు దీనిని కుట్రగా, మరికొందరు నిర్లక్ష్యంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై వినేష్ ఫోగట్ స్వయంగా స్పందించారు.

Also Read: Anna Canteen: ఆ పథకానికి ఎన్టీఆర్ పేరే కరెక్ట్ – పవన్ కళ్యాణ్

అది ఆటలో భాగం

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ప్రెసిడెంట్ PT ఉష, డాక్టర్ దిన్షా పార్దివాలా తర్వాత ఆమె కోచ్ వినేష్ ఆసుపత్రికి చేరుకున్నారు. మహిళా జాతీయ కోచ్‌లు వీరేంద్ర దహియా, మంజీత్ రాణి వినేష్‌తో మాట్లాడిన విషయాన్ని వెల్లడించారు. వార్తా సంస్థ పిటిఐతో వీరేంద్ర దహియా మాట్లాడుతూ.. వినేష్‌పై అనర్హత వేటు పడిన తర్వాత కలకలం రేగింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వినేష్‌ని కలిశాం. మేము కూడా ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించాము. ఆమె ధైర్యవంతురాలైన అమ్మాయి. వినేష్ మాతో మాట్లాడుతూ.. నేను పతకాన్ని గెలుచులేకపోవడం దురదృష్టకరం. కానీ అది ఆటలో భాగమ‌ని చెప్పిన‌ట్లు వారు పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇతర అథ్లెట్లు ప్రభావితమయ్యారు

వినేష్‌పై అనర్హత వేటు పడిన తర్వాత జట్టులోని ఇతర అథ్లెట్లు కూడా ఈ దెబ్బకు గురయ్యారని కోచ్‌ తెలిపాడు. కోచ్ ప్రకారం.. అంతిమ్‌ పంఘల్ కూడా తన ఆటను సరిగ్గా ఆడలేకపోయింది. ఆమె ఎలిమెంట్‌లో కనిపించలేదు. పిటి ఉష వినేష్ ఫోగట్‌ను కలిసిందని మ‌న‌కు తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటో కూడా బయటకు వచ్చింది. సమావేశం అనంతరం పిటి ఉష మాట్లాడుతూ తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని, అయితే పారిస్ ఒలింపిక్స్‌కు అనర్హత వేటు పడటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వినేష్ బరువును దాదాపు 2.5 కిలోలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు.