Site icon HashtagU Telugu

Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు.. జరిగేది ఈ గ్రౌండ్‌లోనే!

Olympics 2028

Olympics 2028

Olympics: 128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ క్రీడలలో (Olympics) క్రికెట్ తిరిగి రాబోతోంది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి సంబంధించి స్టేడియం ప్రకటన కూడా జరిగింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆటగాళ్ల కోటా, పాల్గొనే జట్ల సంఖ్యతో క్రికెట్ తిరిగి రాకను అధికారికంగా ధృవీకరించింది.

ఈ మైదానంలో మ్యాచ్‌లు జరుగుతాయి

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్ మ్యాచ్‌లు దక్షిణ కాలిఫోర్నియాలోని పోమోనాలో ఉన్న ఫెయిర్‌గ్రౌండ్‌లో జరగనున్నాయి. ఫెయిర్‌గ్రౌండ్‌లో 1922 నుంచి లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫెయిర్ నిర్వహించబడుతోంది. పోమోనాలో క్రికెట్ స్టేడియం లేదు. కానీ ఇక్కడ తాత్కాలిక మైదానం నిర్మించబడుతుంది. ఇలాంటిదే 2024 T20 వరల్డ్ కప్ సమయంలో చూశాం. అప్పుడు న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్‌లో వాన్ కార్ట్‌లాండ్ పార్క్‌లో తాత్కాలిక స్టేడియం ఏర్పాటు చేశారు. దాన్ని టోర్నమెంట్ తర్వాత వెంటనే కూల్చివేశారు.

Also Read: Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌కు అరుదైన గౌర‌వం..!

ఆరు జట్లు పాల్గొంటాయి

ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల T20 టోర్నమెంట్‌లలో ఆరేసి జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టుకు 90 మంది ఆటగాళ్ల కోటా ఉంటుంది. దీనితో ప్రతి దేశం గరిష్టంగా 15 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయవచ్చు. క్రీడలు సమీపిస్తున్న సమయంలో మొత్తం టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకటించబడుతుంది.

క్రికెట్ తిరిగి రాకపై జయ్ షా స్పందన

ICC అధ్యక్షుడు జయ్ షా ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి రాకపై ఉత్సాహం వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు. “లాస్ ఏంజిల్స్ 2028లో క్రికెట్ కోసం స్థలం ప్రకటనను మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఇది మా క్రీడ ఒలింపిక్స్‌లో తిరిగి రాక కోసం సన్నాహాల దిశగా ఒక ముఖ్యమైన అడుగు. క్రికెట్ ఒక అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ అయినప్పటికీ ఒలింపిక్స్‌లో వేగవంతమైన, ఉత్తేజకరమైన T20 ఫార్మాట్‌లో చేరినప్పుడు ఇది కొత్త ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.” అని రాసుకొచ్చారు.