Rohit Sharma: గంగూలీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై పిల్ దాఖలు.. ఈనెల 22న విచారణ..!

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా, నటుడు అమీర్ ఖాన్ తదితరులపై జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Rohit Sharma

Resizeimagesize (1280 X 720) 11zon

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా, నటుడు అమీర్ ఖాన్ తదితరులపై జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు. హష్మీ.. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ ఆటగాళ్లు, నటులు ఐపిఎల్‌కు సంబంధించిన వివిధ ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా బెట్టింగ్‌లలో పాల్గొనడం ద్వారా యువత వర్తమాన, భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు.

హష్మీ మాట్లాడుతూ.. “ఈ వ్యక్తులు దేశంలోని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. బెట్టింగ్‌లలో మునిగిపోయేలా బలవంతం చేస్తున్నారు. ఆకర్షణీయమైన బహుమతులతో వారిని ప్రలోభపెడుతున్నారు.అదే సమయంలో యువతను బెట్టింగ్ లకు అలవాటు చేస్తున్నారు. క్రికెట్, ఫిల్మ్ ఐకాన్ అనేక గేమింగ్ షోలను ప్రోత్సహిస్తోంది. IPL జట్టును తయారు చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తోంది. వీరిలో కొందరు బహుమతులు గెలుస్తున్నారు. అయితే ఇది చెడు వ్యసనానికి దారి తీస్తుందని పేర్కొన్నారు.

Also Read: Sunrisers Hyderabad: సన్ రైజర్స్ ఆటగాళ్ల జోరు కొనసాగేనా..?

ఈ రోజుల్లో వివిధ రకాల మొబైల్ గేమింగ్ యాప్‌ల ద్వారా టీమ్‌లుగా ఏర్పడి బహిరంగంగా బెట్టింగ్ ఆడుతున్నారని తమన్నా హష్మీ పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు తీసుకుని ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. దేశంలోని కోట్లాది మంది యువకులు వారిని తమ రోల్ మోడల్‌లుగా పరిగణిస్తున్నారు. ప్రతిరోజూ కోట్లాది రూపాయలను కోల్పోతున్నారని అన్నారు. ప్రముఖుల ప్రచార ప్రభావంతో కోట్లాది మంది యువకులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇది దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. ఈ కేసును ఏప్రిల్ 22న విచారణకు కోర్ట్ వాయిదా వేసింది. తమన్నా హష్మీ గతంలో కూడా చాలా మంది అనుభవజ్ఞులపై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

  Last Updated: 14 Apr 2023, 02:26 PM IST