IND vs SL 2nd ODI: భారత్‌, శ్రీలంక రెండో వన్డే నేడు.. సిరీస్‌ పై టీమిండియా కన్ను

భారత్-శ్రీలంక (IND vs SL) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. భారత్‌, శ్రీలంక మధ్య రెండో వన్డే నేడు (గురువారం) కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
India vs West Indies

India Vs Wi Imresizer

భారత్-శ్రీలంక (IND vs SL) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. భారత్‌, శ్రీలంక మధ్య రెండో వన్డే నేడు (గురువారం) కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది. కాగా.. తొలిమ్యాచ్‌లో ఓడిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్ రేసులో నిలవాలని భావిస్తోంది. క్రికెట్‌ మక్కాగా భావించే ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమ్‌ఇండియా గెలుస్తుందా? లేక లంక పుంజుకుని పోటీలోకి వస్తుందో చూడాలి. అయితే టీమిండియా గతేడాది చివరలో న్యూజిలాండ్‌తో 1-0తో, బంగ్లాదేశ్‌తో 2-1తో ఓడింది.

ఇక ఈ హోం గ్రౌండ్ గురించి చెప్పాలంటే గత ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్టు ఓడిపోలేదు. శ్రీలంకతో సొంతగడ్డపై టీం ఇండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇప్పటి వరకు ఇరు జట్లు 10 సిరీస్‌లలో తలపడగా, టీమ్ ఇండియా తొమ్మిది విజయాలు సాధించింది. ఒక సిరీస్ డ్రా అయింది. ఓవరాల్ రికార్డును పరిశీలిస్తే.. 1997 తర్వాత శ్రీలంకతో భారత్ ఒక్క వన్డే సిరీస్‌ను కోల్పోలేదు. ఇరు జట్ల మధ్య మొత్తం 19 వన్డే సిరీస్‌లు జరిగాయి. ఈ సమయంలో భారత్ 14 గెలిచి రెండింట్లో ఓడిపోయింది. మూడు సిరీస్‌లు టై అయ్యాయి.

Also Read: Tripura Chief Minister: డాక్టర్ గా మారిన త్రిపుర సీఎం..!

కోల్‌కతా వేదికగా భారత్-శ్రీలంక మధ్య ఇప్పటివరకు ఐదు వన్డేలు జరిగాయి. ఈ సమయంలో టీమ్ ఇండియా పైచేయి సాధించింది. ఈ ఐదు వన్డేల్లో మూడింటిలో భారత్ విజయం సాధించింది. అదే సమయంలో శ్రీలంక ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. కాగా ఒక్క మ్యాచ్ ఫలితం బయటకు రాలేదు. శ్రీలంక చివరిసారిగా 1996లో ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌పై వన్డే గెలిచింది. ఆ తర్వాత కోల్‌కతాలో భారత్-శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్ జరిగినప్పుడల్లా విజిటింగ్ టీమ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మైదానంలో 2007 ఫిబ్రవరిలో ఆడిన వన్డే ఫలితం బయటకు రాలేదు.

2017 తర్వాత కోల్‌కతాలో వన్డే
సెప్టెంబర్ 2017 తర్వాత భారత జట్టు తొలిసారిగా ఈడెన్ గార్డెన్స్‌లో వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటి వరకు 21 వన్డేలు ఆడింది. ఇందులో 12 మ్యాచ్‌ల్లో విజయాలు, ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటములు ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌లో ఫలితం లేదు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు టాస్‌ జరుగుతుంది.

  Last Updated: 12 Jan 2023, 08:23 AM IST