Virat Kohli Ranji Fees: భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేయబోతున్నాడు. అతని రంజీల్లో తిరిగి రావడానికి ప్రత్యేకంగా ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (DDCA) సన్నాహాలు పూర్తి చేసింది. అసలే కోహ్లీ ఈ మధ్య పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అయితే బీసీసీఐ కఠిన నియమంతో విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేస్తున్నాడు. అయితే రైల్వేస్తో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీకి రూ. లక్షల్లో (Virat Kohli Ranji Fees) నష్టం వాటిల్లుతుందని సమాచారం. రంజీ మ్యాచ్లు ఆడినందుకు కోహ్లీకి ఎంత మ్యాచ్ ఫీజు ఉంటుందో తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజు ఎంత?
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 23 రంజీ మ్యాచ్లు ఆడాడు. 20 నుంచి 40 రంజీ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు రోజుకు రూ.50 వేలు పొందుతున్నారు. దీని ప్రకారం రైల్వేస్తో రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి రూ.2 లక్షలు అందుతాయి. 40 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడే ఆటగాడికి రోజుకు రూ.60 వేలు లభిస్తాయి. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో ఏ+ గ్రేడ్ ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లికి ఏటా రూ.7 కోట్లు. టెస్ట్ మ్యాచ్ ఆడినందుకు అతనికి రూ.15 లక్షల మ్యాచ్ ఫీజు వస్తుంది. దీని ప్రకారం కోహ్లీకి దాదాపు రూ.13 లక్షల నష్టం వాటిల్లనుంది.
Also Read: Mohammed Siraj: నటి మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్..?
10 వేల మంది అభిమానులకు ఉచిత ప్రవేశం
రైల్వేస్తో విరాట్ కోహ్లీ మ్యాచ్ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు డీడీసీఏ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో మ్యాచ్ని చూడటానికి అభిమానులకు ఉచిత ప్రవేశం కూడా ఉంది. ఈ ప్రేక్షకులందరూ అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం గేట్ నంబర్లు 7, 15, 16 నుండి ప్రవేశం పొందుతారు. విరాట్ కోహ్లీ అభిమానులు కూడా ఈ మ్యాచ్ని టీవీల్లో ఆస్వాదించనున్నారు. ముందుగా ఈ మ్యాచ్ని లైవ్లో చూపించకూడదని బీసీసీఐ ప్లాన్ చేసింది. కానీ విరాట్ కోహ్లీ ఆడుతున్న కారణంగా ఈ మ్యాచ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.