Team India: భారత క్రికెట్ జట్టు (Team India) ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. మొదటి వన్డే మ్యాచ్ గెలిచి టీమ్ ఇండియా సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చర్చనీయాంశంగా మారింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కోచ్ గౌతమ్ గంభీర్ సంబంధాలు గతంలోలా లేవని సమాచారం. రాంచీ వన్డేలో విరాట్ కోహ్లీ తన 52వ వన్డే సెంచరీ చేసినప్పటి నుండి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ వైపు నుండి రోహిత్-కోహ్లీలతో సంభాషణ సరిగా లేదని తెలుస్తోంది.
ఈలోగా కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. వాటిని చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ టీమ్ ఇండియా రెండు వర్గాలుగా విడిపోయిందని అంటున్నారు. నిజానికి భారత జట్టు రెండో వన్డే కోసం రాంచీ నుండి రాయ్పూర్కు వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ మిగతా ఆటగాళ్లకు, కోచ్ గంభీర్కు దూరంగా కూర్చుని కనిపించారు. సాధారణంగా మంచి మూడ్లో ఉండి ఆటగాళ్లతో సరదాగా ఉండే కోహ్లీ ఈ ఫొటోల్లో విడిగా కూర్చుని ఫోన్ చూస్తూ కనిపించారు. అంటే టీమ్ ఇండియాలో జరుగుతున్న గొడవలు ఈ ఫొటోల్లో కూడా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే కేవలం ఇవన్నీ అవాస్తవాలే అని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.
Also Read: Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
Rohit Sharma meeting his best friend team India selector pragyan Ojha. Gautam Gambhir, Rohit and Ojha having fun chat at airport yesterday.❤️ pic.twitter.com/NhVRo3nUZE
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 2, 2025
తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా
ఇకపోతే సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ వార్త రాసే సమయానికి భారత్ జట్టు 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ, గైక్వాడ్ ఉన్నారు. ఇప్పటికే తొలి వన్డేలో గెలిచిన భారత్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది.
