T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 వచ్చే ఏడాది భారత్- శ్రీలంకల సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. ఐసీసీ త్వరలో టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ను విడుదల చేయవచ్చు. అయితే అంతకుముందు భారత్లో ఏయే నగరాల్లో మ్యాచ్లు జరుగుతాయనే దానిపై ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. నివేదిక ప్రకారం.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2026 టీ20 ప్రపంచ కప్ కోసం 5 నగరాలను షార్ట్లిస్ట్ చేసింది. ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంను ఎంపిక చేసింది.
భారత్లో ఈ 5 నగరాల్లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు!
ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. బీసీసీఐ అధికారుల మధ్య ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఇందులో వన్డే ప్రపంచ కప్ 2023తో పోలిస్తే టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్లను తక్కువ నగరాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి బీసీసీఐ భారతదేశంలోని 5 నగరాలను షార్ట్లిస్ట్ చేసింది. ప్రతి వేదికలో కనీసం 6 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ అధికారులు ఎంపిక చేసిన నగరాలు ఇవే.
🚨 2026 T20 WORLD CUP FINAL AT THE NARENDRA MODI STADIUM. 🚨
– Ahmedabad, Delhi, Kolkata, Chennai and Mumbai also been short listed as venues to host the T20 World Cup. (Express Sports). pic.twitter.com/w9NfMDl7Ku
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2025
- అహ్మదాబాద్ (Ahmedabad)
- ఢిల్లీ (Delhi)
- కోల్కతా (Kolkata)
- చెన్నై (Chennai)
- ముంబై (Mumbai)
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం.. శ్రీలంకలోని మూడు స్టేడియంలు ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తాయి. అయితే ఆ మూడు వేదికలు ఏవో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
Also Read: TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త
మహిళల ప్రపంచ కప్ వేదికలకు ఆతిథ్యం లేదు
నివేదిక ప్రకారం.. బెంగళూరు లేదా లక్నో నగరాలను టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్ల కోసం ఎంపిక చేస్తారా లేదా అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. అయితే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 మ్యాచ్లు జరిగిన వేదికలను టీ20 ప్రపంచ కప్కు ఎంచుకోకూడదని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో గువాహటి, విశాఖపట్నం, ఇండోర్, నవీ ముంబై పేర్లు ఉన్నాయి. ఒకవేళ శ్రీలంక జట్టు సెమీఫైనల్కు చేరుకుంటే భారత జట్టు కొలంబోలో ఆడటానికి రావాల్సి ఉంటుందని ఐసీసీ బీసీసీఐకి స్పష్టం చేసింది. అలాగే ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్కు చేరుకుంటే.. ఆ టైటిల్ మ్యాచ్ తటస్థ వేదికలో నిర్వహించబడుతుంది.
