Site icon HashtagU Telugu

MS Dhoni: ధోనీ కాళ్లు మొక్కిన స్టార్ సింగర్.. ధోనీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..!

MS Dhoni

Resizeimagesize (1280 X 720) (7)

మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు అత్యంత ఇష్టపడే క్రికెటర్లలో ఒకరు. స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ కూడా ధోనీకి పెద్ద అభిమాని. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ప్రారంభ వేడుకలో ఇద్దరూ ఎమోషనల్ మూమెంట్‌ను పంచుకున్నారు. ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. చిత్రంలో అర్జిత్ ధోని పాదాలను తాకినట్లు చూడవచ్చు.

ఐపీఎల్ 2023 ఓపెనింగ్ వేడుకలో అర్జిత్ తన హిట్ పాటలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. అతనితో పాటు నటీమణులు రష్మిక మందన్న, తమన్నా భాటియా కూడా హిట్ పాటలను ప్రదర్శించారు. ప్రదర్శన తర్వాత ట్రోఫీ ఆవిష్కరణ కోసం ముగ్గురూ వేదికపై ఉన్నారు. అప్పుడే ఇరు జట్ల కెప్టెన్లను పిలిచారు. తొలుత చెన్నై కెప్టెన్ ధోనీ వేదికపైకి చేరుకున్నాడు. అర్జిత్ దగ్గరకు రాగానే అర్జిత్.. ధోనీ పాదాలను తాకాడు.

Also Read: PV Sindhu: స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ.. సెమీస్ లో సింధు

అర్జిత్‌ హఠాత్తుగా ఇలా చేయడంతో ఆయనను వారించడానికి ధోనీ ప్రయత్నించాడు. ధోనీ వెంటనే అర్జిత్‌ని పైకి లేపి కౌగిలించుకున్నాడు. ఈ ఫొటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహీ ఫ్యాన్స్ కు చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. రష్మిక, తమన్నా కూడా ధోనీకి పెద్ద అభిమానులు. ప్రారంభ వేడుకకు ముందు, ఇద్దరూ మాజీ భారత కెప్టెన్‌ను కలవాలని తమ కోరికను వ్యక్తం చేశారు. అయితే తొలి మ్యాచ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో సీఎస్‌కేపై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్‌ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Exit mobile version