Site icon HashtagU Telugu

Sri Lanka: బ్యాట్స్‌మెన్స్‌ విధ్వంసం.. 4.3 ఓవర్లలోనే 78 పరుగులు!

Sri Lanka

Sri Lanka

Sri Lanka: శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో మొదటి మ్యాచ్ జూలై 10న జ‌రిగింది. ఈ మ్యాచ్‌ను శ్రీలంక (Sri Lanka) 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తూ 154 పరుగులు చేసింది. దీనిని ఆతిథ్య జట్టు శ్రీలంక ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మన్ 262కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ బ్యాట్స్‌మన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాకుండా కేవలం 4.3 ఓవర్లలోనే 78 పరుగులు సాధించాడు.

4.3 ఓవర్లలో 78 పరుగులు

శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మన్‌లు పతుమ్ నిస్సంక, కుశల్ మెండిస్ 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ కేవలం 4.3 ఓవర్లలో 78 పరుగులు చేశారు. నిస్సంక 16 బంతుల్లో 42 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 3 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టాడు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మెండిస్ 51 బంతుల్లో 73 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాట్ నుండి కూడా 5 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి 78 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

Also Read: US Advisory: ‘ఇరాన్‌కు వెళ్లడం ప్రమాదకరం’.. దేశ పౌరులకు అమెరికా హెచ్చ‌రిక‌!

మొదటి టీ20 మ్యాచ్ వివరాలు

బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 154 పరుగులు సాధించింది. జట్టు తరపున పర్వేజ్ హుస్సేన్ 38, మొహమ్మద్ నయీమ్ 32 (నాటౌట్), మెహదీ హసన్ మిరాజ్ 29 పరుగులు చేశారు. ఇతర బ్యాట్స్‌మెన్‌లలో ఎవరూ 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. శ్రీలంక తరపున మహీష్ తీక్షణ 2 వికెట్లు తీసుకోగా, నవీన్ తుషార, షనక, వాండర్సే ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఈ లక్ష్యాన్ని ఛేదిస్తూ శ్రీలంక 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టంతో 159 పరుగులు సాధించింది. జట్టు తరపున నిస్సంక 16 బంతుల్లో 42 పరుగులు, కుశల్ మెండిస్ 73 పరుగులు, కుశల్ పెరీరా 24 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ తరపున మొహమ్మద్ సైఫుద్దీన్, మెహదీ హసన్ మిరాజ్, మరియు రిషద్ హుస్సేన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.