Abhishek Sharma: అభిషేక్ శర్మ (Abhishek Sharma) రికార్డు సెంచరీతో సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని 19వ ఓవర్లో సాధించి చరిత్ర సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అతిపెద్ద విజయవంతమైన రన్ చేజ్. అభిషేక్ 55 బంతుల్లో 141 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను ట్రావిస్ హెడ్తో కలిసి తొలి వికెట్కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకరమైన ఆరంభాన్ని అందించారు. అభిషేక్ 19 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేయగా, హెడ్ 32 బంతుల్లో తన హాఫ్ సెంచరీ సాధించాడు. పంజాబ్ కింగ్స్కు మొదటి వికెట్ లభించినప్పుడు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. హెడ్ను యుజవేంద్ర చాహల్ 13వ ఓవర్ రెండో బంతికి క్యాచ్ ఔట్ చేశాడు. హెడ్ 37 బంతుల్లో 3 సిక్సర్లు, 9 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. ఈ సమయంలో హైదరాబాద్ స్కోరు 12.2 ఓవర్లలో 171/1.
హెడ్ ఔటైన తర్వాత కూడా అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. అతను 40 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా పంజాబ్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో అతను ఔటయ్యాడు. అప్పటికి సన్రైజర్స్ హైదరాబాద్ స్కోరు 222 పరుగులు. అతను జట్టును విజయ తీర్చాలకు చేర్చాడు. అభిషేక్ 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. ఇది అభిషేక్ ఐపీఎల్ చరిత్రలో మొదటి సెంచరీ. ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (132) రికార్డ్ను బద్దలు కొట్టాడు.
పీబీకేఎస్ 8 మంది బౌలర్లను ఉపయోగించింది
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో 8 మంది ఆటగాళ్లతో బౌలింగ్ చేసింది. అర్ష్దీప్, చాహల్ మాత్రమే తమ కోటా నాలుగేసి ఓవర్లు పూర్తి చేశారు. అర్ష్దీప్ 37 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అత్యంత ఖరీదైన బౌలర్ మార్కో జాన్సెన్, 2 ఓవర్లలో 39 పరుగులు లీక్ చేశాడు. యశ్ ఠాకూర్ 2.3 ఓవర్లలో 40, గ్లెన్ మాక్స్వెల్ 3 ఓవర్లలో 40 పరుగులిచ్చాడు. అర్ష్దీప్, యుజవేంద్ర చాహల్కు ఒక్కో వికెట్ దక్కింది.
Also Read: ITR Form: సీనియర్ సిటిజన్లకు ఏ ఐటీఆర్ ఫారం సరైనది?
శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ వృథా
అంతకుముందు శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్తో పంజాబ్ కింగ్స్ 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. అతను 36 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (36), సిమ్రన్ సింగ్ (42) మంచి ఆరంభాన్ని అందించారు. చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ 4 సిక్సర్లు కొట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున మహమ్మద్ షమీ అత్యధిక పరుగులు సమర్పించాడు. అతను 4 ఓవర్ల స్పెల్లో 75 పరుగులిచ్చాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన స్పెల్గా నిలిచింది.