Shami For Arjuna: 2023 సంవత్సరానికి గానూ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్రీడా రంగంలో భారతదేశపు అతిపెద్ద పురస్కారం ‘ఖేల్ రత్న’కు ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంపికయ్యారు. సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ భారీ అవార్డును అందుకోనున్నారు. అదే సమయంలో మహమ్మద్ షమీకి ‘అర్జున అవార్డు’ (Shami For Arjuna) ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అర్జున అవార్డుకు ఎంపికైన 26 మంది ఆటగాళ్ల జాబితాలో షమీకి చోటు దక్కింది. ఈ జాబితాలో పారా ఆర్చర్ శీతల్ దేవి పేరు కూడా చేరింది.
సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్లో భారత జెండాను ఎగురవేశారు. హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో ఈ జోడీ భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించింది. మరోవైపు 2023 ప్రపంచకప్లో మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఆర్చరీ, బాక్సింగ్, రెజ్లింగ్ నుండి పారా ఆర్చరీ, బ్లైండ్ క్రికెట్ వరకు 19 విభిన్న క్రీడల నుండి మొత్తం 28 మంది ఆటగాళ్లు క్రీడా అవార్డులకు ఎంపికయ్యారు.
Also Read: WhatsApp: వాట్సప్లో మీ ఆన్లైన్ స్టేటస్, ప్రొఫైల్ను ఇతరులు చూడకూడదంటే ఇలా చేయాల్సిందే?
ఖేల్ రత్న అవార్డు: చిరాగ్ శెట్టి- సాత్విక్సాయిరాజ్ (బ్యాడ్మింటన్)
అర్జున అవార్డు: ఓజస్ ప్రవీణ్ డియోటాలే (ఆర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్ (అథ్లెటిక్స్), పరుల్ చౌదరి (అథ్లెటిక్స్), మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సర్), ఆర్ వైశాలి (చెస్), మహ్మద్ షమీ (క్రికెట్), అనూష్ అగర్వాల్ (ఈక్యూ స్ట్రియన్ అగర్వాల్) ), దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్), దీక్షా దాగర్ (గోల్ఫ్), కృష్ణ బహదూర్ పాఠక్ (హాకీ), సుశీల చాను (హాకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రీతు నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో-ఖో), పింకీ (లాన్ బాల్స్), ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ (స్క్వాష్), ఐహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), అంతిమ (రెజ్లింగ్), రోషిబినా దేవి (వుషు), శీతల్ దేవి (పారా ఆర్చరీ), అజయ్ కుమార్ (బ్లైండ్ క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్).
We’re now on WhatsApp. Click to Join.
ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు: లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్.బి.రమేశ్ (చెస్), మహావీర్ ప్రసాద్ సైని (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేశ్ ప్రభాకర్ (మల్లఖంబ్).
ద్రోణాచార్య అవార్డు (జీవితకాల పురస్కారం): జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్), భాస్కరన్ (కబడ్డీ), జయంత కుమార్ పుషిలాల్ (టేబుల్ టెన్నిస్), ధ్యాన్చంద్ అవార్డు.
ధ్యాన్చంద్ అవార్డు (జీవితకాల సాఫల్య పురస్కారం): మంజుష కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్శర్మ (హాకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ).