South Africa T20: ఐపీఎల్ తరహాలో మ‌రో టోర్నీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నా ఐపీఎల్ మెగా టోర్నీ మాదిరిగా మ‌రో టీ20 లీగ్ ను ప్రారంభించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడిందింది.

Published By: HashtagU Telugu Desk
Cricket South Africa

Cricket South Africa

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నా ఐపీఎల్ మెగా టోర్నీ మాదిరిగా మ‌రో టీ20 లీగ్ ను ప్రారంభించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడిందింది. ఆరు జట్లు పోటీపడనున్న ఈ టీ20 లీగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొననుండగా ప్రతి టీం ఒక్కో టీంతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. లీగ్ దశ మ్యాచ్‌ల్లో పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్ కు అర్హత సాధిస్తాయి.

ప్లేఆఫ్ దశలో ఈ మూడు జట్లు మళ్లీ ప్రతి జట్టుతో ఒక మ్యాచ్ లో తలపడుతాయి. ఈ మూడు జట్లలో టాప్ లో నిలిచిన ఉన్న రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. ఆఖరికి ఏఈ ఫైనల్లో గెలిచిన జట్టు టోర్నీ విజేతగా నిలుస్తుంది. ఇక నెల రోజుల జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 33మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ మాదిరిగానే ఈ టోర్నీలోనూ ప్రతి జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు ఉంటారు. అలాగే ఆటగాళ్లను కూడా ఐపీఎల్ తరహాలోనే వేలం నిర్వహించి కొనుగోలు చేయనున్నారు. ఈ టోర్నీ విజ‌య‌వంత‌మైతే ఆ తరువాత మహిళల టీ20 టోర్నీ కూడా నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ విజయవంతమవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాకపోతే ఐపీఎల్ అంత గ్రాండ్ సక్సెస్ మాత్రం అవడం కష్టమే అంటున్నారు.

  Last Updated: 02 May 2022, 04:38 PM IST