Shubman Gill: భారత స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) తాజా హెల్త్ అప్డేట్ టీమ్ ఇండియా, అభిమానులను ఆందోళనకు గురి చేసింది. డెంగ్యూతో బాధపడుతున్న శుభ్మన్ గిల్కు ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆఫ్ఘనిస్థాన్తో జరగనున్న మ్యాచ్కు శుభ్మన్ గిల్ ఇప్పటికే దూరమయ్యాడు. ఇప్పుడు శనివారం పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో గిల్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. గిల్ లేకపోవడంతో రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్లో కనిపించనున్నాడు.
శుభ్మన్ గిల్ హెల్త్ అప్డేట్ను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. శుభ్మన్ గిల్ జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లలేదని, చెన్నైలో ఉండి చికిత్స పొందుతారని ఆరోగ్య ప్రకటనలో తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం శుభ్మన్ గిల్లో ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: Cricket In Olympics: ఒలింపిక్స్ లోకి క్రికెట్ రీఎంట్రీ.. వారం రోజుల్లో తుది నిర్ణయం..!
We’re now on WhatsApp. Click to Join.
గత వారం గిల్కు డెంగ్యూ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. దీని తర్వాత ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో గిల్ ఆడలేదు. శనివారం పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో గిల్ ఫిట్గా ఉంటాడని అంతా భావించారు. అయితే ఇప్పుడు అందుకు అవకాశం కనిపించడం లేదు. డెంగ్యూ వంటి వ్యాధి నుంచి కోలుకోవడానికి కనీసం రెండు వారాలు పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో గిల్ వచ్చే వారం ప్రారంభంలో మాత్రమే ప్రాక్టీస్కు తిరిగి రాగలడు. గిల్ ప్రపంచ కప్లో జట్టులో భాగంగా ఉంటాడు. ఈ ఏడాది వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఒకసారి పూర్తిగా ఫిట్గా ఉంటే ప్రపంచ కప్లో గిల్ భారతదేశానికి అతిపెద్ద గేమ్ ఛేంజర్గా నిరూపించగలడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.