Shubman Gill: సోషల్ మీడియాలో వైరల్ గా శుభమన్ గిల్ ట్వీట్.. గిల్ కొంపముంచిన థర్డ్ అంపైర్ నిర్ణయం..!

డబ్ల్యూటీసీ ఆఖరి మ్యాచ్‌ నాలుగో రోజు ఆటలో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఔట్ అయిన తర్వాత ఉత్కంఠ నెలకొంది. గిల్‌ కొట్టిన ఓ బంతిని కామెరూన్ గ్రీన్ క్యాచ్ పట్టాడు.

Published By: HashtagU Telugu Desk
Shubman Gill

Resizeimagesize (1280 X 720) (1)

Shubman Gill: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఆస్ట్రేలియా, ఇండియా జట్లు శ్రమిస్తున్నాయి. అయితే డబ్ల్యూటీసీ ఆఖరి మ్యాచ్‌ నాలుగో రోజు ఆటలో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఔట్ అయిన తర్వాత ఉత్కంఠ నెలకొంది. గిల్‌ కొట్టిన ఓ బంతిని కామెరూన్ గ్రీన్ క్యాచ్ పట్టాడు. కానీ రీప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే ఇది పట్టించుకోకుండా థర్డ్ అంపైర్ భారత ఓపెనర్‌ను ఔట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. మిడిల్ గ్రౌండ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంపై కెప్టెన్ రోహిత్ కూడా మండిపడ్డాడు.

భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోలో శుభమన్ గిల్ క్యాచ్ ని కామెరాన్ గ్రీన్‌ పట్టుకున్నట్లు కనపడుతుంది. వాస్తవానికి కామెరాన్ గ్రీన్ చేతిలో బంతి ఉందని సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ సమయానికి బంతి నేలను తాకింది. ఇది కాకుండా శుభమన్ గిల్ చిత్రంతో కూడిన క్యాప్షన్‌లో ఓ ఎమోజీని పంచుకున్నారు.

https://twitter.com/ShubmanGill/status/1667581278365929472?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1667581278365929472%7Ctwgr%5Eb4057b3f16b0e89ad382ffad13f0e774debf2715%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fsports%2Fcricket%2Find-vs-aus-final-shubman-gill-tweet-on-cameron-green-catch-wtc-2023-final-london-2428756

Also Read: Team India: టెస్టు క్రికెట్ లో టీమిండియా ఛేదించిన అత్యధిక లక్ష్యం ఎంతంటే..?

శుభ్‌మన్ గిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌

అయితే, శుభమన్ గిల్ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతే కాకుండా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా శుభ్‌మన్ గిల్ సంతృప్తిగా లేడని సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు శుభమాన్ గిల్ ట్వీట్‌పై వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని నిరంతరం తెలియజేస్తున్నారు.

444 పరుగుల విజయ లక్ష్యం

మరోవైపు ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. టీమ్ ఇండియాకు 444 పరుగుల విజయ లక్ష్యం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉండగా మరో 7 వికెట్లు మిగిలి ఉన్నాయి. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గిల్, పుజారా పెవిలియన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే క్రీజులో ఉన్నారు.

  Last Updated: 11 Jun 2023, 07:44 AM IST