బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. వెన్ను గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సిఎ)లో ఇప్పటికీ ‘పునరావాస’ ప్రక్రియను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం నుంచి ఫిరోజ్షా కోట్లా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుండగా, అయ్యర్ జట్టులోకి వస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయ్యర్ బెంగుళూరులోని NCAలో ‘పునరావాస’ కార్యక్రమం కొన్ని వీడియోలను పోస్ట్ చేసారు. అందులో అతను శిక్షకుడు S రజనీకాంత్తో కలిసి ఉన్నారు.
ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు (IND vs AUS 2nd Test) మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్టులో కూడా టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్కు దూరం కానున్నాడు. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ కారణంగా రెండో టెస్టుకు కూడా దూరం కానున్నాడు. శ్రేయాస్ ఔట్ కావడంతో సూర్యకుమార్ యాదవ్కు మరో అవకాశం వస్తుందని భావిస్తున్నారు.
Also Read: Gold And Silver Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..!
అదే సమయంలో భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై కూడా వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం.. జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నుండి మాత్రమే కాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ నుండి కూడా అతను దూరంగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో బుమ్రా తిరిగి యాక్షన్లోకి వస్తాడని చూడటానికి అతని అభిమానులు ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. ఈ టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ని నాగ్పూర్లో ఫిబ్రవరి 9 నుంచి నిర్వహించగా, రెండో టెస్టు ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. దీని తర్వాత, ఇప్పుడు సిరీస్లోని మూడో టెస్ట్ మ్యాచ్ ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో మార్చి 1 నుండి 5 వరకు జరుగుతుంది. ఈ టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్ మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీని తర్వాత, ఆస్ట్రేలియా జట్టు కూడా మార్చి 17 నుండి భారత్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆడాల్సి ఉంది.