Site icon HashtagU Telugu

Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Shreyas Iyer

​Shreyas Iyer

Shreyas Iyer: ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐ ఇండియా-ఎ జట్టును ప్రకటించింది. ఇండియా-ఎ జట్టు ఆస్ట్రేలియా-ఎతో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడనుంది. మల్టీ-డే మ్యాచ్‌ల కోసం బీసీసీఐ ఇండియా-ఎ జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించ‌నున్నాడు. అతడితో పాటు పలువురు భారత క్రికెటర్లకు స్క్వాడ్‌లో చోటు కల్పించారు.

కెఎల్ రాహుల్, సిరాజ్‌కు కూడా అవకాశం

కెఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్‌కు మొదటి మ్యాచ్‌లో చోటు లభించనప్పటికీ రెండో మల్టీ-డే టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం ఇద్దరు ఆటగాళ్ళకు జట్టులో చోటు కల్పించనున్నారు. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచే ఆటగాళ్ళకు వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్‌కు టెస్ట్ జట్టులోకి తిరిగి రావడానికి ఇది మంచి అవకాశం. అతను కొంత కాలంగా భారత టెస్ట్ జట్టుకు దూరంగా ఉన్నాడు. శ్రేయాస్‌తో పాటు ధ్రువ్ జురెల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

Also Read: Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం

రెండు మల్టీ-డే టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు జరుగుతుంది. రెండో మల్టీ-డే టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు లక్నోలో జరుగుతాయి. మల్టీ-డే మ్యాచ్‌ల తర్వాత మూడు వన్డే మ్యాచ్‌లు సెప్టెంబర్ 30, 2025, అక్టోబర్ 3, 2025, అక్టోబర్ 5, 2025 తేదీల్లో జరుగుతాయి. బీసీసీఐ ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ కాన్పూర్‌లో జరుగుతాయి.

ఇండియా-ఎ జట్టు ప్రకటన

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బడోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కొటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకుర్