బంగ్లాదేశ్ (Ind vs Ban)తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దీంతో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మూడు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది. నాలుగో రోజు చివరి క్షణం వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో స్వల్ప వ్యవధిలోనే 77 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో శ్రేయస్(29), అశ్విన్ (49) పరుగులతో నిలబడటంతో సిరీస్ భారత్ సొంతమైంది.
Also Read: Bomb cyclone: అమెరికాలో తుఫాను బీభత్సం.. 18 మంది మృతి
మిర్పూర్లో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ను భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడించడంతో శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ కీలకంగా ఉన్నారు. ఈ విజయంతో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. 145 పరుగుల ఛేదనలో టీమిండియా ఆటగాళ్లని బంగ్లా బౌలర్లు కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లు, షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ 71 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడు వికెట్ల తేడాతో టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చారు. వీరితో పాటు అక్షర్ పటేల్ కూడా 34 పరుగులు చేశాడు. భారత్ తరఫున అక్షర్ మూడు వికెట్లు తీయగా, అశ్విన్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.