వచ్చే ఐపీఎల్లో పంజాబ్ జట్టు కెప్టెన్ మారనున్నాడు. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న మయాంక్ అగర్వాల్ ప్లేస్లో సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ను టీమ్ మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. 2023 ఐపీఎల్ నుంచి అతడు జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. మయాంక్ ఈఏడాదే పంజాబ్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈసీజన్లో పంజాబ్ 6వ స్థానానికే పరిమితమైంది. దీంతో కెస్టెన్ను మార్చాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.
ఐపీఎల్ 2023 ఎడిషన్లో మయాంక్ అగర్వాల్ నుంచి పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీని శిఖర్ ధావన్ స్వీకరించబోతున్నాడు. అగర్వాల్ను కింగ్స్ రిటైన్ చేయగా ధావన్ను రూ. మెగా వేలంలో రూ.8.25 కోట్లు పలికింది. IPL 2022 సీజన్లో ధావన్ 14 గేమ్లలో 122.66 స్ట్రైక్ రేట్, 38.33 సగటుతో 460 పరుగులు చేశాడు. 36 ఏళ్ల ధావన్ 206 IPL మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ లో అత్యధిక స్కోరు 106తో మొత్తం 6244 పరుగులు చేశాడు. ధావన్ కు తన ఐపిఎల్ కెరీర్ లో రెండు సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మయాంక్ స్థానంలో ధావన్ ను తీసుకున్న నిర్ణయం బుధవారం PBKS బోర్డు సమావేశంలో ఆమోదించింది. కింగ్స్ జట్టుకు కొత్తగా నియమించబడిన ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
మరోవైపు.. అగర్వాల్ 2018లో పంజాబ్ ఫ్రాంచైజీలో చేరాడు. 2022 ఎడిషన్ టోర్నమెంట్లో మయాంక్ 13 మ్యాచ్లలో 16.33 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు.తన IPL కెరీర్లో మయాంక్ 113 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ లో అత్యధిక స్కోరు 106 పరుగులతో 2327 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్లకు ధావన్ కెప్టెన్గా ఉన్నాడు. అందులో పది సార్లు 2014లో సన్రైజర్స్ హైదరాబాద్కు, 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఒక్కసారి. అతని కెప్టెన్సీలో నాలుగు విజయాలు, ఏడు ఓటములు నమోదు చేశాడు.