IPL 2023లో గురువారం కోల్కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరిగింది. కోల్కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి కోల్కతా నైట్ రైడర్స్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గుర్బాజ్ (57), రింకు సింగ్ (46), శార్దూల్ ఠాకూర్ (68) బ్యాటింగులో విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు ఘనంగానే ఆరంభించినప్పటికీ ఆ తర్వాత తడబడింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మను ఎదుర్కోవడంలో విఫలమైన బ్యాటర్లు క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే వెనుదిరిగారు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన బెంగళూరు ఏ దశలోనూ కుదురుకోలేకపోయింది. ఫలితంగా కోల్కతా విజయం ఖాయమైపోయింది.
Also Read: Reece Topley: బెంగళూరుకు మరో దెబ్బ.. ఐపీఎల్ నుంచి రీస్ టాప్లీ ఔట్
ఈ మ్యాచ్లో తన జట్టు కేకేఆర్కు మద్దతుగా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం స్టాండ్ల నుంచి అభిమానులకు కరచాలనం చేస్తూ అభివాదం చేశారు. 3 సంవత్సరాల తర్వాత KKR తన హోమ్ గ్రౌండ్లోని ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ఆడింది. అదే సమయంలో చాలా కాలం తర్వాత తన జట్టును ప్రోత్సహించేందుకు షారుఖ్ ఖాన్ కూడా ఈడెన్ గార్డెన్స్ వచ్చాడు. షారుక్ ఖాన్ ఈడెన్ గార్డెన్స్ కి ఆయనతో పాటు ఆయన కూతురు సుహానా ఖాన్, బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురు షానయా కపూర్ కూడా మ్యాచ్ను ఎంజాయ్ చేశారు. అయితే షారుఖ్ సాధారణ హూడీలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. కానీ, ఇప్పుడు అభిమానులు షారుక్ ఖాన్ హూడీపై చర్చ నడుస్తుంది.
షారూఖ్ ఖాన్ అభిమానులు అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ కొంతకాలం క్రితం పార్టీలో ధరించిన అదే హూడీలో SRK కనిపించటాన్ని హైలైట్ చేశారు. సూపర్ స్టార్ ఈడెన్ గార్డెన్స్లో ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడం, అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కుడి వైపున రెడ్ క్రాస్ మార్క్ ముద్రించిన బ్లాక్ హూడీని త్వరగా గుర్తించారు. షారుక్, ఆర్యన్ ఒకే హూడీని ధరించిన ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రీకొడుకులు ఆయా సందర్భాలలో తమ సాధారణ ప్రదర్శనలను ప్రదర్శిస్తూ స్టైలిష్గా కనిపిస్తున్నారు. మరోవైపు కోల్కతా జట్టు యజమాని కింగ్ ఖాన్ షారూఖ్, కింగ్ విరాట్ కోహ్లీ కలిసి ఉన్న ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.