Rovman Powell: ఐపీఎల్ 2024 వేలం.. మొదట అమ్ముడైన ఆటగాడు ఇతనే..!

: IPL 2024 కోసం ఆటగాళ్ల వేలం నేడు దుబాయ్‌లో జరుగుతుంది. ఈ వేలంలో అందరికంటే ముందు రూ. కోటి కనీస ధరతో రోవ్‌మన్ పావెల్‌ (Rovman Powell) (వెస్టిండీస్) వేలానికి వచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Rovman Powell

Safeimagekit Resized Img (2) 11zon

Rovman Powell: IPL 2024 కోసం ఆటగాళ్ల వేలం నేడు దుబాయ్‌లో జరుగుతుంది. ఇప్పటికే ఆటగాళ్ల వేలం ప్రారంభం అయింది. ఆటగాళ్ల వేలం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైంది. ఈ వేలంలో అందరికంటే ముందు రూ. కోటి కనీస ధరతో రోవ్‌మన్ పావెల్‌ (Rovman Powell) (వెస్టిండీస్) వేలానికి వచ్చారు. పావెల్ ను రూ. 7. 40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఈ విధ్వంసకర ఆటగాడి కోసం కేకేఆర్ చివరి వరకు ప్రయత్నించింది. కానీ చివరకు ఆర్ఆర్ దక్కించుకుంది. హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రూక్ బేస్ ధర రూ.2 కోట్లు. రాజస్థాన్ రాయల్స్ కూడా బ్రూక్‌ను కొనుగోలు చేయాలని భావించింది. చివరి వరకు ప్రయత్నాలు చేసింది. కానీ రూ.3.80 కోట్ల తర్వాత ధర పెంచలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.

Also Read: IPL New Rule: ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. అదేంటంటే..?

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ బేస్ ధర రూ.2 కోట్లు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపెట్టిన వేలాన్ని ప్రారంభించింది. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ ధరను ఖరారు చేసింది. 6.60 కోట్ల రూపాయలకు CSK చివరి బిడ్ వేసింది. అయితే దీని తర్వాత అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. హైదరాబాద్ హెడ్ ను రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది.

– దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలే రూసో అమ్ముడుపోలేదు. అతని బేస్ ధర రూ.2 కోట్లు.

We’re now on WhatsApp. Click to Join.

 

  Last Updated: 19 Dec 2023, 01:42 PM IST