Rohit Sharma: రంజీ ట్రోఫీలో ముంబై త‌ర‌పున ఆడ‌నున్న రోహిత్ శర్మ?

ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను.

Published By: HashtagU Telugu Desk
Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా త్వరలో జట్టును ప్రకటించనుంది. ఈ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) ఎంపిక కానున్న‌ట్లు స‌మాచారం. పేలవమైన ఫామ్, కెప్టెన్సీ కారణంగా గత కొన్ని నెలలుగా రోహిత్ ప్రజల దృష్టిలో ఉన్నాడు. ఇప్పుడు తన పాత ఫామ్‌ని తిరిగి పొందేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మంగళవారం ఉదయం వాంఖడే స్టేడియంలో జరిగే రంజీ ట్రోఫీ ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ విషయాన్ని ముంబై టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. ఇది మాత్రమే కాదు రోహిత్ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి MCA-BKC గ్రౌండ్‌లో తన శిక్షణను తిరిగి ప్రారంభించాడు.

దీంతో ఛాంపియ‌న్స్‌ టోర్నీకి ముందు రోహిత్ రంజీ మ్యాచ్ ఆడతాడా లేదా అనే ఆస‌క్తి ఇప్పుడు మరింత పెరిగింది. అతను ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో ప్రాక్టీస్ సెషన్‌కు వస్తాడని, జమ్మూ కాశ్మీర్‌తో తదుపరి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ఒక నివేదిక వెల్లడించింది.

Also Read: Sankranthi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంద‌డి.. ఈరోజు ఇలా చేయండి!

పదేళ్ల క్రితం రోహిత్ తన చివరి మ్యాచ్ ఆడాడు

రోహిత్ చివరిసారిగా 2015లో ఉత్తరప్రదేశ్‌తో ముంబై జట్టుతో మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవ‌ల రోహిత్ ఆస్ట్రేలియా పర్యటనలో పేలవమైన ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో 3, 9, 10, 3, 6 స్కోర్ చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టుకు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్ జ‌ట్టు నుంచి వైదొల‌గ‌డంతో జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టాడు.

దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి గంభీర్ ప్రకటన

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవ‌ల‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. దేశీయ క్రికెట్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైనా ఆడేందుకు అందుబాటులో ఉండి, రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు కట్టుబడి ఉంటే తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. దేశవాళీ క్రికెట్‌కు ప్రాముఖ్యత ఇవ్వకపోతే, టెస్టు క్రికెట్‌లో రాణించ‌లేరు అని గంభీర్ పేర్కొన్నాడు.

  Last Updated: 14 Jan 2025, 08:59 AM IST