Womens T20 World Cup: చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. గతేడాది జరిగిన ఈ టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పుడు అందరి దృష్టి మహిళల టీ20 వరల్డ్ కప్పైనే ఉంది. జూన్ 12 నుండి ప్రారంభం కానున్న ఈ పోటీల కోసం ఐసీసీ ఒక భారీ ప్రకటన చేసింది. ఈసారి మహిళల టీ20 వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ రూ. 82 కోట్లుగా ఉండనుంది. విజేతగా నిలిచే జట్టుకు భారీగా నగదు అందుకునే సువర్ణావకాశం ఉంది.
ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ
జూన్ 12 నుండి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 82.64 కోట్ల రూపాయల బహుమతి మొత్తాన్ని ప్రకటించింది. గత ఎడిషన్తో పోలిస్తే ఇందులో 10 శాతం పెరుగుదల కనిపించింది. గతంలో మహిళల టీ20 వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ 7,958,077 డాలర్లు (సుమారు రూ. 74 కోట్లు) ఉండేది. ఇప్పుడు అది 8,764,615 డాలర్లకు (సుమారు రూ. 82 కోట్లు) పెరిగింది.
Also Read: Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
విజేత జట్టుకు ఐసీసీ తరపున 2,340,000 డాలర్లు (రూ. 21.8 కోట్లు) లభిస్తాయి. రన్నరప్ (రెండవ స్థానం) జట్టుకు 1,170,000 డాలర్లు (రూ. 10 కోట్లు) బహుమతిగా అందజేస్తారు. సెమీఫైనల్ ఆడిన జట్లకు సుమారు రూ. 6.29 కోట్లు లభిస్తాయి.
టీమ్ ఇండియా మ్యాచ్ల షెడ్యూల్
- జూన్ 14: భారత్ vs పాకిస్థాన్ (బర్మింగ్హామ్)
- జూన్ 17: భారత్ vs నెదర్లాండ్స్ (లీడ్స్)
- జూన్ 21: భారత్ vs దక్షిణాఫ్రికా (మాంచెస్టర్)
- జూన్ 25: భారత్ vs బంగ్లాదేశ్ (మాంచెస్టర్)
- జూన్ 28: భారత్ vs ఆస్ట్రేలియా (లార్డ్స్)
జులై 5న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ప్రైజ్ మనీ పెంపుతో మహిళల క్రికెట్కు మరింత ఆదరణ లభిస్తుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేసింది.
