Site icon HashtagU Telugu

RCB Record: అద్భుత విజయంతో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

RCB Record

RCB Record

RCB Record: మహిళల ప్రీమియర్ లీగ్‌లో తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస రికార్డులు (RCB Record) సృష్టించింది. స్మృతి మంధాన కెప్టెన్సీలో ఇప్పటి వరకు WPLలో చేయని ఘనతను RCB సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. జట్టు తరపున యాష్లే గార్డనర్ బ్యాట్‌తో సందడి చేసి 37 బంతుల్లో 79 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, బెత్ మూనీ కూడా బ్యాట్‌తో చెలరేగి 56 పరుగులు చేసింది. అయితే 202 పరుగుల భారీ లక్ష్యాన్ని RCB చాలా సులువుగా 18.3 ఓవర్లలో ఛేదించింది.

RCB చరిత్ర సృష్టించింది

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి శుభారంభం లభించలేదు. కెప్టెన్ స్మృతి మంధాన 7 బంతుల్లో 9 పరుగులు చేసి వెంట‌నే ఔటైంది. డేనియల్ హాడ్జ్ కూడా కేవలం 4 పరుగులు చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టింది. దీంతో క్రీజులోకి వచ్చిన అలిస్సా పెర్రీ బాధ్యతలు స్వీకరించి రాఘవి బిష్త్‌తో కలిసి మూడో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పెర్రీ వేగంగా బ్యాటింగ్ చేసి 167 స్ట్రైక్ రేట్‌తో 34 బంతుల్లో 57 పరుగులు చేసింది. పెర్రీ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదింది. పెర్రీ పెవిలియన్‌కు చేరిన‌ తర్వాత రిచా ఘోష్ బ్యాట్‌తో సంచలనం సృష్టించింది. తన పేలుడు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఆర్సీబీ వైపున‌కు లాగేసింది. రిచా 27 బంతులు మాత్రమే ఎదుర్కొని 64 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో రిచా 7 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అదరగొట్టింది.

Also Read: Maha Kumbh Devotees: ప్ర‌యాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది స్పాట్ డెడ్‌

పెర్రీ, రిచాల ఇన్నింగ్స్‌కు RCB మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద పరుగుల ఛేజింగ్ రికార్డు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట నమోదైంది. ముంబై ఇండియన్స్ రికార్డును ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2024లో గుజరాత్‌పై ముంబై 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు

RCB- గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 403 పరుగులు వచ్చాయి. ఇది ఈ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అత్యధిక పరుగులు. అంతకుముందు 2023లో గుజరాత్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 391 పరుగులు నమోదయ్యాయి. WPLలో నలుగురు బ్యాట్స్‌మెన్ యాభైకి పైగా పరుగులు చేయడం ఇది రెండవ సందర్భం. బరోడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురవగా.. ఇరు జట్ల నుంచి మొత్తం 16 సిక్సర్లు నమోదయ్యాయి. WPL చరిత్రలో RCB- ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఒక మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టారు. ఇక్కడ రెండు జట్ల బ్యాట్స్‌మెన్ 19 సిక్సర్లు కొట్టారు.

 

 

Exit mobile version