Ravindra Jadeja: మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టీమ్ ఇండియా గౌరవాన్ని కాపాడాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి జడేజా ఇంగ్లీష్ జట్టు విజయాశలపై నీళ్లు చల్లి, మ్యాచ్ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జడేజా 185 బంతులు ఆడి 107 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్గా నిలిచాడు. సుందర్తో కలిసి జడేజా అందరూ ఆశలు వదిలేసిన ఒక అద్భుతాన్ని సాధించాడు. ఈ డ్రా విలువ విజయం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పొచ్చు. భారత జట్టు పరువును కాపాడుతూ జడేజా మాంచెస్టర్లో చరిత్ర కూడా సృష్టించాడు.
చరిత్ర సృష్టించిన జడేజా
రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్లో నంబర్ 6 కంటే కింద బ్యాటింగ్ చేస్తూ SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ఈ రికార్డును జడేజా మాంచెస్టర్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో తన 107 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్తో సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో జడ్డూ 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు.
Also Read: TCS Layoffs: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు టీసీఎస్ భారీ షాక్..ఏకంగా 12 వేల మంది తొలగింపు
Batting Average – 42.52
Bowling Average – 26.98RAVINDRA JADEJA HAS BEEN UNSTOPPABLE IN TEST CRICKET SINCE 2019 🤯
The Greatest all-rounder in Tests in Modern Era. pic.twitter.com/nCwqoxKCNL
— Johns. (@CricCrazyJohns) July 28, 2025
ఇంకా, ఇంగ్లండ్లో నంబర్ 6 కంటే కింద బ్యాటింగ్ చేస్తూ అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (9 సార్లు) సాధించిన రికార్డు కూడా జడేజా పేరిట నమోదైంది. ఈ జాబితాలో అతను గ్యారీ సోబర్స్ రికార్డును సమం చేస్తూ సంయుక్తంగా టాప్లో నిలిచాడు.
మరో అరుదైన విజయం
రవీంద్ర జడేజా ఇంగ్లండ్లో 1000 కంటే ఎక్కువ పరుగులు, 30 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతని ముందు ఈ విజయాన్ని గ్యారీ సోబర్స్, విల్ఫ్రెడ్ రోడ్స్ మాత్రమే సాధించారు. జడ్డూ ఇంగ్లిష్ గడ్డపై ఇప్పటివరకు 34 వికెట్లు తీశాడు.
మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా ఇంగ్లండ్కు 311 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో ఈ టెస్ట్లో భారత జట్టు ఓటమి దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే, భారత బ్యాట్స్మెన్లు గట్టి పోరాటానికి సిద్ధపడ్డారు. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ జోడీ నాలుగో రోజు మొత్తం ఇంగ్లిష్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రాహుల్ 90 పరుగులు చేయగా, శుభ్మన్ గిల్ సిరీస్లో మరో సెంచరీ సాధించాడు. వీరిద్దరూ ఔట్ కాగానే భారత అభిమానుల గుండెల్లో గుబులు మొదలైంది. అయితే వాషింగ్టన్ సుందర్తో కలిసి జడేజా నెలకొల్పిన 203 పరుగుల అజేయ సాంగత్యం ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లి, మ్యాచ్ను డ్రా చేయగలిగింది. ఈ అద్భుతమైన పోరాటం భారత క్రికెట్ చరిత్రలో నిస్సందేహంగా గుర్తుండిపోతుంది.