Site icon HashtagU Telugu

Ravindra Jadeja: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్ దేవ్ త‌ర్వాత మ‌నోడే!

Ravindra Jadeja

Ravindra Jadeja

Ravindra Jadeja: కోల్‌కతాలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒక గొప్ప మైలురాయిని చేరుకున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ అయిన తర్వాత జడేజా కోల్‌కతా టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో 10 పరుగులు చేయగానే దిగ్గజాల జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

రవీంద్ర జడేజా అరుదైన రికార్డు

కోల్‌కతా పిచ్‌పై పరుగులు చేయడం చాలా కష్టంగా ఉన్న సమయంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న ఆ సమయంలో అతను 27 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తన 10వ పరుగు పూర్తి చేయగానే.. రవీంద్ర జడేజా ఒక పెద్ద రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4,000 కంటే ఎక్కువ పరుగులు, 300 కంటే ఎక్కువ వికెట్లు సాధించిన ప్రపంచంలోని నాల్గవ ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. జడేజా కంటే ముందు ఈ అద్భుతమైన ఘనతను ఇయాన్ బాథమ్ (ఇంగ్లాండ్), డేనియల్ వెటోరీ (న్యూజిలాండ్), కపిల్ దేవ్ (భారత్) మాత్రమే సాధించారు. ఇప్పుడు జడేజా కూడా ఈ ఎలైట్ ఆల్‌రౌండర్ల జాబితాలో చేరారు.

Also Read: Government In Bihar: ముఖ్యమంత్రి పీఠం.. శాఖల కేటాయింపుపై అమిత్ షాతో జేడీయూ నేతల భేటీ!

బౌలింగ్‌లోనూ జడేజా సంచలనం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌లో జడేజా తన బౌలింగ్‌తోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 8 ఓవర్లు వేసి కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే వికెట్ దక్కలేదు. దానిని సరిచేసుకుంటూ.. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టాడు. ఆఫ్రికా జట్టుకు ఇంకా 3 వికెట్లు మిగిలి ఉండగా.. జడేజా తన ఐదో వికెట్ కూడా తీసే అవకాశం ఉంది. దీంతో పాటు రవీంద్ర జడేజా భారత గడ్డపై 250 టెస్ట్ వికెట్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు. భారత గడ్డపై ఈ ఘనత సాధించిన నాల్గవ భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఒకే దేశంలో 2,000 కంటే ఎక్కువ పరుగులు, 250+ టెస్ట్ వికెట్లు తీసిన ఆటగాళ్లలో స్టువర్ట్ బ్రాడ్, రవీంద్ర జడేజా మాత్రమే ఉండటం మరో విశేషం.

Exit mobile version