Site icon HashtagU Telugu

Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్‌.. సంజూ శాంస‌న్ ప్లేస్‌లో యువ ఆట‌గాడు!

Rajasthan Royals

Rajasthan Royals

Rajasthan Royals: సీజన్ 18 ప్రారంభానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా తొలి 3 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా కాకుండా బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగనుంది. సీజన్ 18కి ముందు రాజస్థాన్ రాయల్స్ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఇంకా పూర్తి ఫిట్‌గా లేడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కూడా మారిపోయాడు. అయితే కెప్టెన్సీని ఓ యువ ఆట‌గాడు చేతుల్లో పెట్ట‌నున్నాడు శాంస‌న్‌. ఈ విషయాన్ని స్వ‌యంగా సంజూ శాంస‌నే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఈ ఆటగాడు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు

ప్ర‌స్తుతం సంజూ శాంసన్ గాయంతో బాధపడుతున్నాడు. దాని కారణంగా అతను మొదటి మూడు మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడగలడు. ఇదే జరిగితే మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారనేది అభిమానుల మదిలో మెదులుతోంది. దానికి శాంస‌న్ స్వయంగా సమాధానం చెప్పాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని పేర్క‌న్నాడు.

Also Read: Bangladesh : ప్రధాని మోడీ, యూనస్‌ మధ్య భేటీ కోసం బంగ్లాదేశ్‌ యత్నాలు !

ఐపీఎల్ 2024లో సంజూ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన చేసింది. అతని కెప్టెన్సీలో జట్టు ఎలిమినేటర్‌కు చేరుకుంది. దీంతో పాటు బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ ప్రదర్శన కూడా చాలా బాగుంది. ఐపీఎల్ 2024లో సంజు 153.47 స్ట్రైక్ రేట్‌తో 531 పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో సంజూ మూడు మ్యాచ్‌లకు దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప‌రాగ్ సెంచరీ చేశాడు

సీజన్-18 ప్రారంభానికి ముందు అన్ని జట్ల ఆటగాళ్లు తమలో తాము ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు కూడా భారీ షాట్లు కొట్టడం కనిపించింది. , ఈ సమయంలో రియాన్ పరాగ్ 64 బంతుల్లో 144 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప‌రాగ్ ఈ మంచి ప్రదర్శన రాజస్థాన్ రాయల్స్‌కు మంచి సంకేతాలు ఇస్తోంది.