Site icon HashtagU Telugu

PV Sindhu: ఒలింపిక్స్‌లో ఓట‌మి త‌ర్వాత పీవీ సింధు స్పంద‌న ఇదే..!

PV Sindhu

PV Sindhu

PV Sindhu: పారిస్ ఒలింపిక్స్ 2024 ఆరో రోజు భారత్‌కు మంచి రోజు కాదు. ఒకవైపు భారత్ పతకం సాధిస్తే.. మరోవైపు బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు (PV Sindhu), హాకీలో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. ఈ మూడు క్రీడల్లోనూ భారత అభిమానులు తమ జట్టు, వారి ఆటగాళ్ల నుండి పతకాలు ఆశించారు. అయితే ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన మ్యాచ్‌లో ఓడి పారిస్ ఒలింపిక్స్‌కు దూరంగా ఉండటంతో కోట్లాది మంది భారత అభిమానుల ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. ఈసారి కూడా పీవీ సింధు పతకం సాధిస్తుందని అభిమానులు ఎదురుచూశారు. కానీ సింధు క‌ల‌, అభిమానుల ఆశ‌లు రెండు ఆవిర‌య్యాయి.

ఓటమి తర్వాత పీవీ సింధు ఏం చెప్పింది?

పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆరో రోజు చైనా క్రీడాకారిణి చేతిలో పీవీ సింధు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత పీవీ సింధు మాట్లాడుతూ.. మేం కష్టపడ్డాం చేయగలిగినదంతా చేశాం. అదంతా అదృష్టానికి సంబంధించిన గేమ్. దాని గురించి నాకు పశ్చాత్తాపం లేదు. నేను మ్యాచ్‌లో పోరాడుతూనే ఉన్నాను కానీ తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు. మ్యాచ్‌లో మేమిద్దరం 1 పాయింట్ కోసం పోరాడుతున్నాం. కానీ నా డిఫెన్స్‌లో కొన్ని పొరపాట్లను నియంత్రించి ఉండాల్సిందని అనుకుంటున్నాను అని అన్నారు.

Also Read: Rahul Gandhi: నాపై ఈడీ దాడులు చేయ‌బోతున్నారు: రాహుల్ గాంధీ

చైనా క్రీడాకారిణి బింగ్ జియావో చేతిలో సింధు ఓడిపోయింది

ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఆరో రోజు బ్యాడ్మింటన్ రౌండ్-16 మ్యాచ్‌లో పీవీ సింధు చైనాకు చెందిన బింగ్ జియావోతో తలపడింది. ఈ మ్యాచ్‌లో చైనాకు చెందిన బింగ్ జియావోపై 21-19, 21-14 తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ప్యారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు ప్రయాణం కూడా ముగిసింది. ఈ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణికి పీవీ సింధు గట్టి పోటీనిచ్చినా సింధు గెలవలేకపోయింది.

We’re now on WhatsApp. Click to Join.