PSL: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాల సైన్యాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 22 మంది నిరపరాధులు తమ ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత భారత్ పాకిస్తాన్లోని పలు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. భారత్ చర్యల తర్వాత పాకిస్తాన్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఇప్పుడు దీని ప్రభావం పాకిస్తాన్లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025పై కనిపించే అవకాశం ఉంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్పై ముంచుకొస్తున్న ప్రమాదం
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025పై ప్రమాదం ముంచుకొస్తుంది. మీడియా నివేదికల ప్రకారం PSL 2025 మ్యాచ్లను లాహోర్, రావల్పిండి నుంచి కరాచీకి తరలించారు. ఒకవేళ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే దీని ప్రభావం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో ఇప్పటివరకు 34 మ్యాచ్లలో 24 మ్యాచ్లు ఆడారు. మే 8న పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రావల్పిండిలో జరగాల్సి ఉంది. ఆ తర్వాత మిగిలిన 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు రావల్పిండిలో, 1 మ్యాచ్ ముల్తాన్లో జరగాల్సి ఉంది. అయితే ఈ మిగిలిన మ్యాచ్లను కరాచీలో జరపవచ్చు. మరీ పరిస్థితి దిగజారితే పీఎస్ఎల్ రద్దు కూడా అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: CM Revanth Reddy: హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
IPL 2025పై కూడా ప్రభావం పడే అవకాశం
ఉద్రిక్తతల నడుమ IPL 2025పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. నిజానికి IPL 2025లో మ్యాచ్ నంబర్ 61 పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ను ధర్మశాల నుంచి అహ్మదాబాద్కు తరలించే అవకాశం ఉంది. అయితే IPL ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.