PBKS vs RCB: నేడు పంజాబ్‌తో బెంగ‌ళూరు కీలక పోరు.. ఆర్సీబీకి కెప్టెన్సీ ఎవ‌రూ చేస్తారు?

గత మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీకి వ్యతిరేకంగా జితేష్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో ఆర్‌సీబీకి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో జితేష్ కేవలం 33 బంతుల్లో 85 పరుగులు సాధించాడు.

Published By: HashtagU Telugu Desk
IPL Tickets

IPL Tickets

PBKS vs RCB: ఐపీఎల్ 2025లో ఈ రోజు పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ (PBKS vs RCB) మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కోసం రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జైంట్స్‌ను ఓడించి ఆర్‌సీబీ టాప్-2లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల నుంచి ఆర్‌సీబీ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జితేష్ శర్మ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే రజత్ పాటిదార్ గాయంతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ర‌జ‌త్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు క్వాలిఫయర్ 1లో మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను గెలిచి రెండు జట్లు ఈ రోజు ఫైనల్ టికెట్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. అలాగే ఓడిపోయిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడుతూ కనిపిస్తుంది.

Also Read: Meenakshi Natarajan : తెలంగాణ సర్కారు పనితీరుపై మీనాక్షి స్కాన్.. ఎమ్మెల్యేలతో భేటీలో కీలక అంశమదే

రజత్ పాటిదార్ కెప్టెన్సీ చేయవచ్చు

నిజానికి ఆర్‌సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ ప్ర‌స్తుతం గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో మ్యాచ్ సమయంలో అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతూ వ‌స్తున్నాడు. అతను ఫీల్డింగ్ చేయడానికి రాడు. అయితే జితేష్ శర్మ కెప్టెన్సీ చేస్తూ కనిపించాడు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే.. క్వాలిఫయర్ 1లో కూడా జితేష్ శర్మే ఆర్‌సీబీ కెప్టెన్సీ చేస్తాడా? కానీ ఈ రోజు రజత్ పాటిదార్ పూర్తిగా ఫిట్‌గా ఉంటే మరోసారి అతన్ని ఆర్‌సీబీ కెప్టెన్‌గా చూడవచ్చు.

జితేష్ శర్మపై దృష్టి

గత మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీకి వ్యతిరేకంగా జితేష్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో ఆర్‌సీబీకి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో జితేష్ కేవలం 33 బంతుల్లో 85 పరుగులు సాధించాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో మొదటి అర్ధ సెంచరీ, ఉత్తమ ఇన్నింగ్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు జితేష్‌కు మరోసారి అవకాశం లభిస్తే అభిమానులు అతని నుంచి ఇలాంటి ధనాధన్ ఇన్నింగ్స్‌ను ఆశిస్తారు.

 

  Last Updated: 29 May 2025, 10:02 AM IST