Pakistan Squad: కొంతమంది ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రదర్శన సంబంధిత సమస్యల కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ జట్టు (Pakistan Squad) ప్రకటనను మే చివరి వరకు వాయిదా వేసింది. మే 23 లేదా 24న పాకిస్థాన్ తన T20 ప్రపంచ కప్ జట్టును ప్రకటిస్తుందని, ప్రపంచ కప్ టెక్నికల్ కమిటీ అనుమతి లేకుండానే తమ జట్టులో మార్పులు చేసేందుకు పోటీ జట్లకు ICC నిర్దేశించిన గడువు ఇదేనని పీసీబీ మూలం తెలిపింది. మహ్మద్ రిజ్వాన్, ఆజం ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, హరీస్ రవూఫ్లకు గాయాలవడంతో మేనేజ్మెంట్, సెలెక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితిలోవారు తుది నిర్ణయం తీసుకునే ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్లో వారి ప్రదర్శనను అంచనా వేస్తారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టును గురువారం సెలక్టర్లు ప్రకటించనున్నారు.
Also Read: Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
టీ20 ప్రపంచకప్ 2024లో జట్లను ప్రకటించేందుకు ఐసీసీ మే 1ని చివరి తేదీగా నిర్ణయించింది. ఇప్పటి వరకు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో సహా పలు పెద్ద జట్లు తమ జట్టులను ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రదర్శనకు సంబంధించిన సమస్యల కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టు ప్రకటన తేదీని పొడిగించింది. నివేదికల ప్రకారం.. PCB రాబోయే ప్రపంచ కప్ కోసం మే 23 లేదా మే 24 న తన జట్టును ప్రకటించవచ్చు. మే 25 వరకు తమ జట్టులో మార్పులు చేయడానికి ఐసీసీ జట్లకు అనుమతి ఇచ్చిందని తెలిసిందే. అందువల్ల పీసీబీ ఏ సందర్భంలోనైనా దాని కంటే ముందు తన జట్టును ప్రకటించాల్సి ఉంటుంది.
We’re now on WhatsApp : Click to Join
ఈ కారణంగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటన తేదీని పొడిగించాలని నిర్ణయించింది. ప్రపంచ కప్కు ముందు బాబర్ అజామ్, ఇతర ఆటగాళ్లకు మంచి సమన్వయాన్ని నెలకొల్పడానికి బోర్డు సమయం ఇవ్వాలని కోరుతున్నట్లు నివేదికలో చెప్పబడింది. ఇటీవలే రిటైర్మెంట్ నుండి తిరిగి వచ్చిన ఇద్దరు ఆటగాళ్లు ఇమాద్ వసీమ్, మహ్మద్ అమీర్లను కూడా ఈ ప్రపంచ కప్ జట్టులో చేర్చుకోవచ్చని సమాచారం.