SRH vs PBKS: ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య రాజీవ్ గాంధీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను జితేష్ శర్మ తీసుకున్నాడు. టి20 ప్రపపంచకప్ దృష్ట్యా శామ్ కుర్రాన్ తిరిగి ఇంగ్లాండ్కు వెళ్ళిపోయాడు. అంతకుముందు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయపడటంతో పంజాబ్ సారధి బాధ్యతలను శామ్ కుర్రాన్ కు అప్పగించారు. ఇక ఈ రోజు మ్యాచ్ లో పంజాబ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జితేష్ శర్మ సంచలన నిన్ఱయం తీసుకున్నాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇలా ఏ ఒక్క కెప్టెన్ కూడా చేయకపోవడం గమనార్హం.
పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. అయితే ఈ జట్టు 2008 నుండి ప్రతి సీజన్లోనూ పాల్గొంటోంది. ఐపీఎల్ 2014లో ఆ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. కోల్కతా నైట్ రైడర్స్పై ఓడిపోయింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు రాణించలేకపోయింది. ప్లేఆఫ్ రేసులో కూడా అర్హత సాధించలేదు. జట్టు రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ షురూ కూడా గాయపడటంతో పంజాబ్ నష్టపోయింది.
నిజానికి ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తన ప్లేయింగ్ 11లో ఒకే ఒక్క విదేశీ ఆటగాడిని చేర్చుకోవడం ఇదే తొలిసారి. సన్రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ 11వ ర్యాంక్లో ఏకైక విదేశీ ఆటగాడు రిలే రూసోకు అవకాశం లభించింది. ఇంతకుముందు ఐపీఎల్లో ఏ జట్టు కూడా ఒకే ఒక్క విదేశీ ఆటగాడిని ప్లేయింగ్ ఎలెవన్లో చేర్చలేదు. కెప్టెన్గా తన తొలి మ్యాచ్లోనే జితేష్ శర్మ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇది కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపికలో కూడా విదేశీ ఆటగాడికి అవకాశం దక్కలేదు. వాస్తవానికి ఐపీఎల్ లో జట్లు ఏ మ్యాచ్కైనా తమ ప్లేయింగ్ ఎలెవన్లో గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను ఆడిస్తారు.
పంజాబ్ జట్టు: ప్రభ్సిమ్రాన్ సింగ్, అథర్వ తైడే, రిలే రూసో, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్/కెప్టెన్), అశుతోష్ శర్మ, శివమ్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, రిషి ధావన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్.పంజాబ్ కింగ్స్ జట్టు ఇంపాక్ట్ ప్లేయర్లలో అర్ష్దీప్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, విధ్వత్ కావరప్ప, హర్ప్రీత్ సింగ్ భాటియా ఉన్నారు.
Also Read: YS Sharmila : వైసీపీపై వ్యతిరేకత.. షర్మిల మెజారిటీపై జోరుగా బెట్టింగ్లు..