ODI World Cup: ICC వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) 2023 భారతదేశంలో జరగనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు త్వరలో సన్నాహాలు ప్రారంభించనుంది. తాజాగా ప్రపంచకప్ గురించి ఓ పెద్ద వార్త వచ్చింది. నివేదికల ప్రకారం.. ప్రపంచకప్కు సంబంధించిన వేదిక (World Cup Venue)ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. WTC ఫైనల్ మ్యాచ్ తర్వాత ప్రపంచ కప్ వేదికను ప్రకటించవచ్చు.
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఇంకా ప్రకటించబడలేదు. అయితే త్వరలో వేదికలపై అప్డేట్ రావచ్చు. WTC ఫైనల్ మ్యాచ్ తర్వాత దీనిని ప్రకటించవచ్చు. WTC ఫైనల్ మ్యాచ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ వేదికగా జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత వేదికపై అప్డేట్ పొందవచ్చు.
ఈ సంవత్సరం భారతదేశంలో జరగనున్న ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్, వేదిక వచ్చే నెల WTC ఫైనల్ సందర్భంగా ప్రకటించనున్నారు. శనివారం జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జేఎం) అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని వెల్లడించారు. ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ వేదికలను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా విలేకరుల సమావేశంలో ప్రకటిస్తామని షా చెప్పారు. టోర్నీ పూర్తి షెడ్యూల్ను కూడా విడుదల చేయనున్నారు. ACC సభ్యుడు (టెస్ట్ ప్లేయింగ్), అసోసియేట్ దేశాల సమావేశం తర్వాత ఆసియా కప్ 2023 భవిష్యత్తుపై కూడా నిర్ణయం తీసుకోబడుతుందన్నారు.
ప్రపంచకప్కు ముందు భారత్- ఆఫ్ఘనిస్థాన్ సిరీస్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రతిపాదిత పరిమిత ఓవర్ల సిరీస్ ప్రపంచ కప్కు ముందు జరగనుంది. అయితే తేదీలు, వేదికలు ఇంకా నిర్ణయించబడలేదు. అభిమానులకు సరైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని 15 స్టేడియాలను షార్ట్లిస్ట్ చేసినట్లు షా తెలియజేశారు. తర్వాత దీనికి మరికొన్ని స్టేడియాలు జోడించబడతాయి. ఈ పని బాధ్యత గ్రాంట్ థోర్న్టన్కు అప్పగించబడిందన్నారు.
పోష్ పాలసీ కోసం ప్రత్యేక కమిటీ
భారత్లో జరగనున్న ప్రపంచకప్, మహిళల ప్రీమియర్ లీగ్కు సంబంధించిన పనులను నిర్వహించే కొన్ని ప్రత్యేక కమిటీలను కూడా బీసీసీఐ వారం రోజుల్లోగా ప్రకటించనుంది. ఇది కాకుండా, POSH (లైంగిక వేధింపుల నివారణ) విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీ కూడా ఉంటుంది. జులైలో బంగ్లాదేశ్ పర్యటనకు ముందే మహిళల జట్టు ప్రధాన కోచ్ని కూడా ఎంపిక చేస్తామని షా తెలిపారు.
ప్రపంచ కప్ 2023 వేదికల గురించి మాట్లాడినట్లయితే.. చాలా పెద్ద నగరాలు దీని కోసం దృష్టి పెట్టాయి. మీడియా కథనాల ప్రకారం.. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం, చెన్నైలోని ఎంఏ. చిదంబరం స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలలో మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. ఇందులో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్, ఇండోర్లోని హోల్కర్ స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియంలు కూడా ఉన్నాయి.
ప్రపంచ కప్ 2023 భారతదేశంలో జరగనుంది. దీనికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేక పెద్ద ప్రకటనలు చేసింది. ఆసియా కప్ ఆడేందుకు భారత్.. పాకిస్థాన్కు రాకపోతే తాము కూడా భారత్కు రాలేమని పీసీబీ చీఫ్ చెప్పారు. ఈసారి ఆసియా కప్ పాకిస్థాన్లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రెండు టోర్నీల వేదికపై స్పష్టత లేదు. అయితే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారత్ వచ్చే అవకాశం ఉంది.