IPL Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుక‌లు.. 13 స్టేడియాల్లో రంగం సిద్ధం!

ఐపీఎల్‌ 2025 సీజన్-18 ప్రారంభానికి ఇంకా 3 రోజులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు సీజన్-18ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
PBKS Vs MI

PBKS Vs MI

IPL Opening Ceremony: ఈసారి ఐపీఎల్ 2025కి సంబంధించి (IPL Opening Ceremony) బీసీసీఐ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కారణంగా సీజన్-18 ప్రారంభ వేడుకలను 13 స్టేడియంలలో నిర్వహించవచ్చు. ఐపీఎల్‌ 2025 సీజన్-18 ప్రారంభానికి ఇంకా 3 రోజులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు సీజన్-18ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దీంతో అభిమానులు ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఒకటి, రెండు రోజులు కాకుండా చాలా రోజుల పాటు చూసే అవకాశం ఉంది. IPL 2025 ప్రారంభ మ్యాచ్ మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరగనుంది. ప్రారంభ వేడుకలు ఇక్కడి నుండి ప్రారంభమవుతాయి.

స్పోర్ట్‌స్టార్ ప్రకారం టోర్నమెంట్ కోసం మొత్తం 13 వేదికలలో BCCI ప్రారంభ వేడుకలను నిర్వహిస్తుంది. మార్చి 22న ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్లు హాజరుకానున్నారు. ఇందులో గాయని శ్రేయా ఘోషల్, నటి దిశా పటానీ ఉన్నారు. “మేము టోర్నమెంట్‌కు మరింత రంగును జోడించాలనుకుంటున్నాము. తద్వారా ప్రతిచోటా ప్రేక్షకులు ప్రారంభ వేడుకలను ఆస్వాదించవచ్చు. ప్రతి వేదిక వద్ద జాతీయ, స్థానిక కళాకారులను కలిగి ఉండేలా మేము ప్లాన్ చేస్తున్నామ,” అని ఒక మూలం స్పోర్ట్‌స్టార్‌కి తెలిపింది. ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే తొలిసారి. అందువల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగకుండా ఈవెంట్లను సక్రమంగా నిర్వహించేందుకు బీసీసీఐ, రాష్ట్ర సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి.

Also Read: Sunita Williams: 9 నెల‌ల త‌ర్వాత భూమీ మీద‌కు వ‌చ్చిన సునీతా విలియ‌మ్స్‌.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే?

జై షా కూడా హాజరు కానున్నారు

నివేదిక ప్రకారం.. కోల్‌కతాలో జరగనున్న ఐపిఎల్ 2025 ప్రారంభ వేడుకలకు ఐసిసి ఛైర్మన్ జై షా, ఇతరులు కూడా హాజరుకానున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో నిర్వహించే 12 కార్యక్రమాలకు సంబంధించి ఇతర కళాకారులతో తుది చర్చలు జరుగుతున్నాయి. IPL 2025 మ్యాచ్‌లు గౌహతి, విశాఖపట్నం, ముల్లన్‌పూర్‌లో కూడా జరుగుతాయి. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు ఇది రెండవ హోమ్ గ్రౌండ్. ఐపీఎల్ 2025 ప్రారంభం మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. కేకేఆర్, ఆర్సీబీ జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈసారి ఐపీఎల్‌లో కొత్త నిబంధ‌న‌లు సైతం అమ‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

  Last Updated: 19 Mar 2025, 10:05 AM IST