ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో ఈ అతిపెద్ద క్రికెట్ లీగ్కు ముందు చాలా జట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మీడియా నివేదికల ప్రకారం.. ఐపిఎల్కు ఎంపికైన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్రారంభ మ్యాచ్లలో కనిపించరు. మీడియా కథనాల ప్రకారం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు యాక్షన్లో కనిపించరు. ఆఫ్రికన్ జట్టు మార్చి చివరిలో నెదర్లాండ్స్తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ జట్టుకు చాలా కీలకం. భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించాలంటే దక్షిణాఫ్రికా జట్టు నెదర్లాండ్స్ను ఓడించాలి. ఇటువంటి పరిస్థితిలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ సిరీస్లో జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది.
Also Read: Nitish Rana: కోల్కతా కెప్టెన్గా నితీష్ రాణా..!
నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా మధ్య ఈ సిరీస్ మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు జరగనుంది. అదే సమయంలో తొలి ఐపీఎల్లో ఆఫ్రికన్ ప్లేయర్ గైర్హాజరు కావడంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐకి సమాచారం అందించింది. సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఈ కారణంగా చాలా నష్టపోతున్నట్లు కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ మార్క్రామ్. మార్క్రామ్ తో పాటు హెనిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆటగాళ్లు లేకపోవడం హైదరాబాద్ జట్టుకు మైనస్. వీరు తొలి మ్యాచ్ లకు అందుబాటులో ఉండరు.
ఈ జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ (మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్), ఢిల్లీ క్యాపిటల్స్ (నార్జే, లుంగి ఎన్గిడి), ముంబై ఇండియన్స్ (ట్రిస్టాన్ స్టబ్స్, బహుశా డెవాల్డ్ బ్రూయిస్), డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (మిల్లర్), లక్నో సూపర్ జెయింట్స్ (క్వింటన్ డి కాక్), పంజాబ్ కింగ్స్ (రబడా)లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఉన్నారు.