Neeraj Chopra: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) చరిత్ర సృష్టించాడు. దోహ డైమండ్ లీగ్లో ఈ కొత్త రికార్డును నీరజ్ చోప్రా క్రియేట్ చేశాడు 90.23 మీటర్ల కంటే ఎక్కువ దూరం జావెలిన్ను విసిరిన చోప్రా ఈ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 2025 దోహా డైమండ్ లీగ్లో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల అవరోధాన్ని దాటాడు. నీరజ్ తొలి త్రోతో 88.44 మీటర్లు విసిరి ఆధిక్యంలోకి వెళ్ళాడు. కానీ మూడవ ప్రయత్నంలోనే అతను చరిత్ర సృష్టించాడు. నీరజ్ మూడో త్రో 90.23 మీటర్లు విసిరాడు. ఇది అతని కెరీర్లో అత్యుత్తమమైనది. దోహా డైమండ్ లీగ్లో అతని ఆధిక్యాన్ని బలోపేతం చేస్తుంది. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారతదేశానికి చెందిన కిషోర్ జెనా కూడా పోటీలో ఉన్నాడు.
Lt. Colonel Neeraj Chopra 🫡🫡 https://t.co/QnWA6Ueb8Q
— Raj (@PratyushRaj27) May 16, 2025
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. డైమండ్ లీగ్లో 90.23 మీటర్ల దూరం ఈటె విసిరి కొత్త రికార్డు స్థాపించాడు. ఈ ఫీట్తో అతను 90 మీటర్ల మార్కును అందుకున్న 25వ ఆటగాడు కాగా.. మూడవ ఆసియా క్రీడాకారుడిగా కూడా నిలిచాడు. భారతదేశానికి ఇది చారిత్రాత్మక మొదటి స్థానం. నీరజ్ ఈ విజయంతో దేశాన్ని గర్వపడేలా చేశాడు. అతని అసాధారణ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
Also Read: Saraswati Pushkara Mahotsav: సరస్వతి పుష్కర మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న భట్టి!
ఈ పోటీలో జూలియన్ వెబర్ తన మూడవ ప్రయత్నంలో 89.06 మీటర్ల దూరం విసిరి రెండవ స్థానంలో నిలిచాడు. నీరజ్తో దూరంలో పోటీపడలేకపోయాడు. ఆండర్సన్ పీటర్స్ 85.64 మీటర్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. అయితే భారతదేశానికి చెందిన మరో ఆటగాడు కిషోర్ జెనా 8వ స్థానానికి పడిపోయాడు. నీరజ్ చోప్రా ఈ సాధన ద్వారా భారత క్రీడా చరిత్రలో మరో అధ్యాయాన్ని జోడించాడు. అతని కఠిన శ్రమ, అంకితభావం, అసమాన ప్రతిభ ఈ విజయానికి కారణం. ఈ రికార్డు యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. భారతదేశ జావెలిన్ క్రీడలో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది.