Mustafizur Rahman: సీఎస్కే జ‌ట్టుకు మ‌రో షాక్‌.. స్టార్ బౌల‌ర్‌కు గాయం

బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman) గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా ఆట‌గాడు ఒక్కసారిగా పిచ్ పై పడిపోయాడు.

  • Written By:
  • Updated On - March 18, 2024 / 05:21 PM IST

Mustafizur Rahman: IPL 2024 ప్రారంభానికి ముందు CSK ఒకదాని తర్వాత ఒకటి షాక్‌లు ఎదుర్కొంటుంది. మొదట చెన్నై బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ సీజ‌న్ దూరం అయ్యాడు. ఆ తర్వాత CSK ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరానా గాయపడి 4-5 వారాల పాటు IPLకి దూరమయ్యాడు. దీంతో ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో జట్టు కష్టాలు మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. IPL 2024కి ముందు CSK మరొక ఫాస్ట్ బౌలర్ గాయపడి మైదానం నుండి బయటకు వెళ్లాడు.

బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman) గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా ఆట‌గాడు ఒక్కసారిగా పిచ్ పై పడిపోయాడు. ప్లేయర్‌ను వెంటనే స్ట్రెచర్‌పై బయటకు తీశారు. 48వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌కు ముందు రెహమాన్ 9 ఓవర్లు బౌల్ చేశాడు. అందులో అతను 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఈ ఎపిసోడ్‌లో అతను 42వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆటగాడు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో కూడా అతను పిచ్‌పై పడిపోయాడు. అయినప్పటికీ అతను తనను తాను నియంత్రించుకున్నాడు.

Also Read: Kanguva: సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కంగువ టీజర్ వచ్చేస్తోంది

టెన్షన్‌లో మహీ టీమ్

ముస్తాఫిజుర్ రెహ్మాన్ అప్పటికే సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అయితే అతను 48వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో మరోసారి పిచ్‌పై పడిపోయాడు. ఈసారి మరిన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. అతను మళ్లీ మళ్లీ తిమ్మిరి సమస్యలను ఎదుర్కొన్నాడు. తర్వాత స్ట్రెచర్‌పై పడుకోబెట్టి బయటకు తీసుకొచ్చారు. దీని తర్వాత మిగిలిన ఓవర్లను సౌమ్య సర్కార్ బౌల్‌ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ టెన్షన్ పెరగడమే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ కూడా టెన్షన్ పెరిగింది.

చెన్నై జట్టు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ ఆటగాడిపై చెన్నై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం చెన్నైకి ముస్తాఫిజుర్ అవసరం చాలా ఎక్కువ. చెన్నై తరుపున ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరన గాయం కారణంగా ఇప్పటికే దూరమయ్యాడు. అటువంటి పరిస్థితిలో పతిరానా లేని లోటును పూరించడానికి ముస్తాఫిజుర్ ఒకడు. కానీ అతను కూడా IPL ప్రారంభానికి ముందు గాయపడ్డాడు. అతను ఎప్పుడు కోలుకుంటాడనే దానిపై ఇంకా సమాచారం రాలేదు. ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌ని చెన్నై మార్చి 22న బెంగళూరుతో ఆడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ముగ్గురు ఆటగాళ్లకు గాయాలైన తర్వాత CSK ఎలాంటి ఆటతీరుతో ముందుకు వస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.

We’re now on WhatsApp : Click to Join