మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 72 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్కు చేరింది. మార్చి 26న టైటిల్ మ్యాచ్లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. యూపీ వారియర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యూపీ జట్టు 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది.
ఎలిమినేటర్ మ్యాచ్లో యూపీ వారియర్స్పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 72 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. అక్కడ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీపడనుంది. మార్చి 26న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే ఫైనల్లో తలపడతాయి. ముంబై రెండో స్థానంలో నిలిచింది. యూపీ మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఎలిమినేటర్కు చేరుకుంది. అయితే మరింత ముందుకు సాగలేకపోయింది.
Also Read: Visa: ఈ వీసాలతోనూ ఉద్యోగాలకు ఎలిజిబుల్… గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!
నటాలీ స్కివర్ బ్రంట్ అజేయంగా 72 పరుగులు చేయడంతో పాటు ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్తో ముంబై అఖండ విజయాన్ని అందుకుంది. ఇస్సీ వాంగ్ నాలుగు ఓవర్లలో 15 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది. మహిళల ప్రీమియర్ లీగ్లో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. కిరణ్ నవగిరే, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్లను అవుట్ చేయడం ద్వారా ఆమె హ్యాట్రిక్ పూర్తి చేసింది.
యూపీ కోసం కిరణ్ నవగిరే ఒంటరి పోరాటం చేసింది. 27 బంతుల్లో 43 పరుగులు చేసి ఔట్ అయింది. అవతలి వైపు నుంచి ఆమెకి ఎలాంటి మద్దతు లభించలేదు. దీప్తి శర్మ 16, గ్రేస్ హారిస్ 14, అలిస్సా హీలీ 11 పరుగుల వద్ద ఔటయ్యారు. 11 మంది యూపీ బ్యాట్స్మెన్లలో కేవలం నలుగురు బ్యాట్స్మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. ముంబై తరఫున ఇస్సీ వాంగ్తో పాటు సైకా ఇషాక్ రెండు వికెట్లు తీసింది. నటాలీ సీవర్, హేలీ మాథ్యూస్, జే కలిత ఒక్కొక్క వికెట్ సాధించారు.