IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…ఏంటో తెలుసా..?

IPL 2023...ఆరంభానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ టోర్నమెంట్ లో వేర్వేరు ఫ్రాంచైజీల ఆటగాళ్లు అందరూ తమ దేశం తరపున ఆడుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 12:20 PM IST

IPL 2023…ఆరంభానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ టోర్నమెంట్ లో వేర్వేరు ఫ్రాంచైజీల ఆటగాళ్లు అందరూ తమ దేశం తరపున ఆడుతున్నారు. ఆసియా కప్ 2022 కౌంటి లీగ్ రంజీ మ్యాజ్ లో పాల్గొంటున్నారు. అక్టోబర్ లో ప్రారంభం కానున్న T20ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఆయా ప్లేయర్లు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. IPL2023లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని కొసాగనున్నారు. ఈ మేరకు CSKచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీర్ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ వన్ ఇండియా ట్వీట్ చేసింది. ధోనీ సారథ్యంలో తాము IPL2023లో ఆడబోతున్నామని కాశీ విశ్వనాథన్ స్పష్టం చేసినట్లు ప్రకటించింది. కాగా ఐపీఎల్ 2022 లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో ఆడలేదన్న సంగతి తెలిసిందే.