భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోనీ అమెరికా టూర్ లో బిజీగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ తన విరామ సమయాన్ని అటు కుటుంబంతోనూ, ఇటు ఇష్టమైన వ్యాపకాలతోనూ గడుపుతున్నాడు. గోల్ఫ్, టెన్నిస్ , ఫుట్ బాల్ మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తో కలిసి యుఎస్ ఓపెన్ మ్యాచ్ లను వీక్షిస్తున్నాడు. హోరాహోరీగా సాగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మ్యాచ్లను వీక్షిస్తున్న వారిద్దరి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లో ఓ మ్యాచ్కు హాజరైన ధోనీ.. మ్యాచ్ను తదేకంగా వీక్షిస్తుండగా… ఆయనతో ఓ వ్యక్తి మాట్లాడుతున్నారు. అదే సమయంలో కెమెరాను చూసిన ధోనీ ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఆ తర్వాత కెమెరా అదే మ్యాచ్ను వీక్షిస్తున్న కపిల్ దేవ్ వంక తిరగగా…ఆయన కూడా ప్రేక్షకులకు అభివాదం చేశాడు.
అంతకుముందు వీరిద్దరూ కలిసి తమ ఫ్రెండ్స్ తో హోటల్ దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అమెరికాలో క్రికెట్ కు ఫ్యాన్స్ ఎక్కువగా లేకున్నా…ధోనీ, కపిల్ దేవ్ కూడా మాత్రం మంచి క్రేజే ఉంది. వీరిద్దరినీ గుర్తు పట్టిన ఫ్యాన్స్ ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యుఎస్ ఓపెన్ తుది దశకు చేరుకున్నాయి. శనివారం మహిళల సింగిల్స్ జరగనుండగా.. ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్ జరగనుంది.
Indian cricketing royalty at the #USOpen 🇮🇳🏏🎾
Two former Indian World Cup winning captains, @msdhoni and @therealkapildev graced the stands at Arthur Ashe yesterday as two young future Champions battled it out for 5 hours and 15 minutes 🤩#GoBigOrGoHome #SonySportsNetwork pic.twitter.com/e7CCgHJOMZ
— Sony Sports Network (@SonySportsNetwk) September 9, 2022