Mohammed Shami: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. మహ్మద్ షమీ జ‌ట్టులోకి రానున్నాడా?

రంజీ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్ తన ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ సిరీస్‌లో టీమిండియా ఓడిపోయింది. ఈ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జ‌ట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. అక్కడ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడ‌నున్నాయి.

ఆస్ట్రేలియా టూర్‌కు 18 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)కి చోటు కల్పించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మహ్మద్ షమీ తిరిగి రాగలడా లేదా అనే దానిపై పెద్ద అప్‌డేట్ వచ్చింది.

Also Read: Vastu Tips: లక్ష్మీదేవి ఫోటోను ఏ దిశ‌లో ఉంచాలో తెలుసా?

షమీ తిరిగి వస్తాడా?

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. రంజీ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్ తన ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నివేదించినట్లుగా దీపావళి తర్వాత నవంబర్ మొదటి వారంలో బెంగళూరులో కర్ణాటకతో బెంగాల్ నాల్గవ రౌండ్ మ్యాచ్‌లో షమీ ఆడే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌కు మహ్మద్ షమీ లేని జట్టును బీసీసీఐ ప్రకటించింది. కొన్ని రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడిన తర్వాత షమీని జట్టులోకి తీసుకుంటారని వార్తలు వ‌స్తున్నాయి. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ షమీని తొందరపెట్టకూడదని నిర్ణయించుకుంది. సమయానికి ఫాస్ట్ బౌలర్ కోలుకునేలా చూస్తోంది.

మహ్మద్ షమీ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తరపున ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా షమీ టీం ఇండియాకు దూరమయ్యాడు. ఇప్పుడు నవంబర్ మొదటి వారంలో బెంగాల్, కర్ణాటక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ బెంగాల్ తరఫున ఆడనున్న‌ట్లు స‌మాచారం.

  Last Updated: 27 Oct 2024, 10:47 AM IST