Mumbai Indians: ఎస్ఎ 20 లో కెప్టెన్ గా రషీద్ ఖాన్.. ఫ్రాంచైజీలకు సారథులుగా వ్యవహరించేది వీరే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ తో పాటు ఇతర దేశాలలో జరిగే లీగ్ లలో కూడా

  • Written By:
  • Publish Date - December 2, 2022 / 06:07 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ తో పాటు ఇతర దేశాలలో జరిగే లీగ్ లలో కూడా అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలోని తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండిన్స్ మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐఎల్ టీ20 కు ఇప్పటికే సారథిని ప్రకటించిన ముంబై తాజాగా సౌతాఫ్రికా టీ20 ఎస్ఎ టీ20 లీగ్ కుసైతం కెప్టెన్ ను ప్రకటించింది. కాగా ఇప్పటికే ఐఎల్ టీ20 లో ముంబై ఎమిరేట్స్ కు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ అయిన కీరన్ పొలార్డ్ ను సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఎస్ఎ 20 లో ముంబై కేప్‌టౌన్ కు ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కెప్టెన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇదే విషయాన్ని ముంబై ఇండియన్స్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ముంబై యజమాని ఆకాశ్ అంబానీ ట్వీట్ చేస్తూ స్వచ్చే సీజన్ లో వివిధ లీగ్ లలో మా ఫ్రాంచైజీలకు సారథులుగా వ్యవహరించేది వీరే.. పొలార్డ్, రషీద్ లు ఐఎల్ టీ20, ఎస్ఎ టీ20లలో ముంబై ప్రతిష్టను మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చారు.

అలాగే ఎంఐ ఎమిరేట్స్ కు డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహీర్ వంటి ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఐఎల్టీ20 లీగ్ జనవరి 13 నుంచి ప్రారంభం కాబోతుంది. ఎమిరేట్స్ జట్టుకు షేన్ బాండ్ హెడ్ కోచ్ గా ఎంపిక అయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా లీగ్ లో అయితే రషీద్ ఖాన్ తో పాటగా డెవాల్డ్ బ్రెవిస్, కగిసొ రబాడా, రస్సీ వన్ డర్ డసెన్, జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్ లు ఉన్నారు. కాగా కేప్‌టౌన్ జట్టుకు సైమన్ కటిచ్ హెడ్ కోచ్ గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే హషీమ్ ఆమ్లా బ్యాటింగ్ కోచ్ గా నియమితుడయ్యాడు.