Sachin Tendulkar: నేడు స‌చిన్ టెండూల్క‌ర్ బ‌ర్త్ డే.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ గురించి ఈ విష‌యాలు తెలుసా..?

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన భారత జట్టు మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈరోజు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - April 24, 2024 / 08:54 AM IST

Sachin Tendulkar: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన భారత జట్టు మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఈరోజు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ సాధించలేని మైలురాళ్లను సచిన్ తన క్రికెట్ కెరీర్‌లో సాధించాడు. ప్రతి యువ ఆటగాడు సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకుని అతనిలా గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలని కోరుకుంటాడు. రోహిత్ శర్మ నుంచి విరాట్ కోహ్లి వరకు పెద్ద ఆటగాళ్లు సచిన్‌ను ఆదర్శంగా భావిస్తారు.

16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశారు

సచిన్ టెండూల్కర్ 1989లో కేవలం 16 ఏళ్ల వయసులో టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశారు. సచిన్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడారు. అరంగేట్రం మ్యాచ్‌లో సచిన్‌కు ప్రమాదకరమైన బౌన్సర్ తగిలి ముక్కు నుండి రక్తం కారింది. అయినప్పటికీ సచిన్ పట్టు వదలలేదు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రమాదకరమైన బౌలర్ వసీం అక్రమ్ తన ఫాస్ట్ బౌలింగ్ కారణంగా క్రికెట్‌ను శాసిస్తున్నాడు. అయినా ఈ మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్లను ఏమాత్రం భయపడకుండా ధీటుగా ఎదుర్కొన్నాడు.

Also Read: CSK vs LSG: ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించిన మార్కస్ స్టోయినిస్

అత్యధిక పరుగుల నుండి అత్యధిక సెంచరీల వరకు

సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున క్రికెట్ ఆడినంత కాలం సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఏ క్రికెటర్‌కీ సాధ్యం కానీ రికార్డులను సచిన్ సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ పేరిట 34 వేలకు పైగా పరుగులు ఉన్నాయి. ఇది కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన రికార్డు కూడా సచిన్ పేరు మీద‌నే ఉంది. అందులో సచిన్ 51 టెస్టులు, 49 వన్డేలు ఆడాడు. సచిన్ టెస్ట్ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడాడు. 15921 పరుగులు చేశాడు. ఈ గొప్ప బ్యాట్స్‌మెన్ 463 వన్డే మ్యాచ్‌లలో 18426 పరుగులు చేశాడు.

We’re now on WhatsApp : Click to Join

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ భారత జట్టు పేరును ఎంతో ఉన్నతంగా నిలిపాడు. ఈరోజు అందరూ అతన్ని క్రికెట్ గాడ్ అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ కూడా సచినే. 2010లో దక్షిణాఫ్రికాపై మాస్టర్ బ్లాస్టర్ ఈ డబుల్ సెంచరీ సాధించాడు. సచిన్‌కు భారతరత్న అవార్డు కూడా లభించింది. 2013లో వెస్టిండీస్‌తో వాంఖడేలో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికినట్లు ప్రకటించారు.