Mark Wood Ruled Out: ఇంగ్లాండ్ జ‌ట్టుకు భారీ దెబ్బ‌.. భార‌త్‌తో సిరీస్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం!

ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా వచ్చే నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Mark Wood Ruled Out

Mark Wood Ruled Out

Mark Wood Ruled Out: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఘోరంగా అవమానించిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు మరో చేదు వార్త వెలువడింది. ఇంగ్లిష్ టీమ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ (Mark Wood Ruled Out) గాయం కారణంగా నాలుగు నెలల పాటు దూరంగా ఉన్నాడు. ఈ 4 నెలల్లో వుడ్ ఎలాంటి క్రికెట్ ఆడలేడు. భారత్‌తో జరిగే సిరీస్‌లో వుడ్ ప్రభావం చూప‌గ‌ల‌డు. ఇటీవ‌ల కాలంలో ఇంగ్లండ్ జట్టుకు ఏదీ సరిగ్గా జరగడం లేదు. ఇప్పుడు వుడ్ గాయం ఆ జట్టులో టెన్షన్‌ని మరింత పెంచింది.

ఇంగ్లండ్‌కు భారీ దెబ్బ

ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా వచ్చే నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. వుడ్ ఎడమ మోకాలి స్నాయువు బాగా దెబ్బతింది. దీని కారణంగా అతను శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన X ఖాతాలో వుడ్‌కు సంబంధించి ఈ అప్డేట్‌ ఇచ్చింది. వుడ్ గత ఏడాది కాలంగా మోకాలికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతను మరింత ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వుడ్ గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ECB ప్రకారం.. వుడ్ ఫిట్‌గా ఉంటే జూలై 2025 చివరి నాటికి తిరిగి మైదానంలోకి రాగలడని పేర్కొంది.

Also Read: AB de Villiers On Rohit Sharma: రోహిత్ ఎందుకు రిటైర్ కావాలి? ఏబీ డివిలియ‌ర్స్ కీల‌క వ్యాఖ్య‌లు!

భారత్‌తో జరిగే సిరీస్‌లో భాగం కాలేడు

భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మార్క్ వుడ్ ఆడటం లేదు. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. లీడ్స్‌లోని మైదానంలో జూన్ 20 నుంచి 24 మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా.. రెండో టెస్టు మ్యాచ్ జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. అదే సమయంలో జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో సిరీస్‌లో మూడో మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ జులై 23 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ జూలై 31 నుంచి ఓవల్‌లో జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో గ్రూప్ దశలోనే ఓడి ఇంగ్లాండ్ జట్టు నిష్క్రమించింది. జట్టు నిరాశాజనక ప్రదర్శన కారణంగా జోస్ బట్లర్ టోర్నమెంట్ మధ్యలో కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

  Last Updated: 13 Mar 2025, 08:00 PM IST