Rohit Sharma Captaincy: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా లేదా?

37 ఏళ్ల రోహిత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. కెప్టెన్‌గా తన పాత్రలో కొనసాగుతాడు. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్ట్ సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో హెడ్డింగ్లీలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

Published By: HashtagU Telugu Desk
Team India

Team India

Rohit Sharma Captaincy: గత ఏడాదిలో టీ20 ప్రపంచకప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను టీమ్ ఇండియా గెలిచిన విష‌యం తెలిసిందే. కానీ టెస్టు క్రికెట్‌లో టీమిండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. జట్టు మొదట న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఓటమిని ఎదుర్కొంది. ఆపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడింది. అందులోనూ ఓట‌మి పాలైంది. ఆ స‌మ‌యంలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma Captaincy) చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు అతని కెప్టెన్సీపై ఒక బిగ్ అప్డేట్ వ‌చ్చింది. ఇక్కడ IPL 2025 ముగిసిన తర్వాత రోహిత్‌ ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా మారడం గురించి చర్చ జరుగుతోంది.

పిటిఐ నివేదిక ప్రకారం.. 37 ఏళ్ల రోహిత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. కెప్టెన్‌గా తన పాత్రలో కొనసాగుతాడు. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్ట్ సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో హెడ్డింగ్లీలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లలో అతని ఆటతీరు ప్రత్యేకంగా ఏమీ లేనప్పటికీ.. ఇంగ్లండ్‌లో సీనియర్ భారత జట్టుకు రోహిత్ నాయకత్వం వహిస్తాడని నివేదిక పేర్కొంది.

Also Read: Japanese Water Therapy: జపనీస్ వాటర్ థెరపీ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలివే!

ఆస్ట్రేలియాలో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు

సెప్టెంబరు 2024- జనవరి 2025 మధ్య ఆడిన 10 టెస్ట్ మ్యాచ్‌లలో 164 పరుగులు మాత్రమే చేయడంతో భారత జట్టులో ఈ 37 ఏళ్ల ఆటగాడి భవిష్యత్తు సందేహాస్పదంగా మారింది. ఇందులో అతని కష్టతరమైన ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది. అక్క‌డ రోహిత్‌ 6.2 సగటుతో కేవలం 31 పరుగులు చేశాడు. ఇది ఆస్ట్రేలియాలో పర్యాటక కెప్టెన్‌కి అత్యంత చెత్త సగటు. దీని తర్వాత జనవరిలో రంజీ ట్రోఫీలో అతని పునరాగమనం కూడా నిరాశప‌ర్చింది.

బుమ్రా ఫిట్‌నెస్‌పై భారత్ దృష్టి

ఆస్ట్రేలియా టూర్‌లో వెన్ను గాయం నుంచి ఇంకా కోలుకుంటున్న స్టార్ పేస్‌మెన్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కూడా భారత్ మేనేజ్‌మెంట్ ఓ కన్నేసి ఉంచింద‌ని నివేదిక పేర్కొంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2025లో బుమ్రా తొలి కొన్ని మ్యాచ్‌లు ఆడ‌లేడు.

 

  Last Updated: 27 Mar 2025, 01:51 PM IST