Kuldeep Yadav: పుట్టినరోజున అత్యుత్తమ బౌలింగ్ చేసిన బౌలర్‌గా కుల్దీప్ యాదవ్..!

కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) గురువారం (డిసెంబర్ 14) తన 29వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో భారత బౌలర్ తనకు తాను గొప్ప బహుమతిని ఇచ్చుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Kuldeep Yadav

Kuldeep Yadav

Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) గురువారం (డిసెంబర్ 14) తన 29వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో భారత బౌలర్ తనకు తాను గొప్ప బహుమతిని ఇచ్చుకున్నాడు. మూడవ T20లో దక్షిణాఫ్రికాపై 5 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ 2.5 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదుగురు సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ బాట పట్టించాడు.

ఈ మ్యాచ్ తర్వాత పురుషుల T20 క్రికెట్ చరిత్రలో తన పుట్టినరోజున అత్యుత్తమ బౌలింగ్ చేసిన బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ 2.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి మొత్తం 17 పరుగులు ఇచ్చి ఆతిథ్య జట్టులోని 5 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. 17 పరుగులకే 5 వికెట్లు తీయడం టీ20 క్రికెట్‌లో బర్త్‌డే బాయ్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

2021లో తన పుట్టినరోజున కొలంబో మైదానంలో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 9 పరుగులకే 4 వికెట్లు పడగొట్టిన శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగా పేరు ఈ జాబితాలో కుల్దీప్ యాదవ్ తర్వాత వచ్చింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ స్పిన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ మూడో స్థానంలో ఉన్నాడు. 2014లో చిట్టగాంగ్ మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇమ్రాన్ తాహిర్ తన పుట్టినరోజున 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అందువల్ల ఈ మూడు బౌలింగ్ ప్రదర్శనలు T20 క్రికెట్‌లో పుట్టినరోజున అత్యుత్తమ ప్రదర్శనలుగా నిలిచాయి.

Also Read: India Win: అదరగొట్టిన సూర్య, కుల్దీప్.. మూడో టీ ట్వంటీ మనదే, సిరీస్ సమం..!

టీ20 ఇంటర్నేషనల్‌లో కుల్దీప్ యాదవ్‌కు ఐదు వికెట్లు తీయడం ఇది రెండో సారి. అంతకుముందు 2018లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ భారత బౌలర్ 5 వికెట్లు పడగొట్టాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది.

We’re now on WhatsApp. Click to Join.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. జట్టు తరపున కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగుల అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను 95 పరుగులకే ఆలౌట్ చేసి 106 పరుగుల తేడాతో గెలుపొందారు. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు. కాగా ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కొక్క వికెట్ సాధించారు.

  Last Updated: 15 Dec 2023, 09:50 AM IST