శ్రీలంక (Sri Lanka)తో జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే T20 సిరీస్కు టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Kohli)తో పాటు ఓపెనర్ కె.ఎల్ రాహూల్ (KL Rahul) దూరం కానున్నట్లు తెలిసింది. గాయం తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడంతో రోహిత్ శర్మ ఆడే అవకాశం తక్కువేనని చెబుతున్నారు. కోహ్లీకి విశ్రాంతి నివ్వనున్నట్లు సమాచారం. పెళ్లి కారణంగానే రాహుల్ సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
జనవరి 3 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం మరికొద్ది రోజుల్లోనే జట్టును ఎంపిక చేయవచ్చు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఆడించడంపై నిర్ణయం తీసుకోలేదు. అతని వేలి గాయం ఇంకా మానలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించవచ్చు. టీ20 జట్టులో ఓపెనర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ స్థానం కూడా ఖరారు కాలేదు. శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి అతడిని తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ ఫార్మాట్లో రాహుల్ ఇటీవల ఫామ్ చాలా పేలవంగా ఉంది. అతను గత ఆరు ఇన్నింగ్స్లలో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. రాహుల్ పాకిస్థాన్పై నాలుగు, నెదర్లాండ్స్పై 9, దక్షిణాఫ్రికాపై 9, బంగ్లాదేశ్పై 50, జింబాబ్వేపై 51, ఇంగ్లండ్పై ఐదు పరుగులు చేశాడు. చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ శ్రీలంకతో సిరీస్ కోసం జట్టును ఎంపిక చేస్తుంది. T20 ప్రపంచ కప్లో భారత జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా ఈ సెలక్షన్ కమిటీ తొలగించబడింది. అయితే కొత్త సెలక్షన్ కమిటీని ప్రకటించడానికి ఒక వారం పట్టవచ్చు. సెలక్షన్ కమిటీ సభ్యులను షార్ట్లిస్ట్ చేయడానికి క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) డిసెంబర్ 26, 28 మధ్య అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తుందని భావిస్తున్నారు.
Also Read: Ind vs Ban 2nd Test: టీమిండియా ఘన విజయం.. క్లీన్ స్వీప్ చేసిన భారత్
శ్రీలంకతో వైట్ బాల్ జట్టును పాత కమిటీ ఎంపిక చేస్తుంది అని BCCI అధికారి ఒకరు తెలిపింది. ప్రస్తుతానికి T20I సిరీస్కు ముందు రోహిత్ శర్మ వేలి గాయం నుంచి కోలుకునేలా కనిపించడంలేదు. ఈ సందర్భంలో హార్దిక్ జట్టుకు నాయకత్వం వహించవచ్చు. టీ20 ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీకి కొన్ని రోజులు విశ్రాంతి కూడా ఇవ్వవచ్చు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ ఇప్పటికే భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా 15 మ్యాచ్లలో 44.27 సగటుతో 487 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో ఎనిమిది వికెట్లు కూడా తీశాడు. దీని తర్వాత జూన్ నెలలో అతను భారత జట్టుకు వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రిషబ్ పంత్ నేతృత్వంలోని జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ను టీమిండియా 2-2తో ముగించింది.