Jay Shah: దులీప్ ట్రోఫీ రాబోయే సీజన్ చర్చనీయాంశంగా మారింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5-22 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో కూడా ఆడాలనే విషయంపై చాలా దృష్టి పెట్టారు. ఇంతలో బీసీసీఐ కార్యదర్శి జై షా (Jay Shah) ఓ కీలక ప్రకటన చేశారు. ఒక ఆటగాడు గాయపడితే అతను టీమ్ ఇండియాలో ఎలా పునరాగమనం చేయగలడో వివరించారు..!
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన జైషా పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. 2022 ఆసియా కప్ సమయంలో రవీంద్ర జడేజా మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఆ సమయంలో జడేజాకు ఫోన్ చేసి టీమ్ ఇండియాకు తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని షా చెప్పాడు. ఈ కారణంగా జడేజా ఆ సమయంలో రంజీ సీజన్లో సౌరాష్ట్ర తరపున ఆడాడు. తరువాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2022 కోసం భారత జట్టుకు తిరిగి వచ్చిన విషయాన్ని ఆయన చెప్పారు.
Also Read: Parliament : పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం.. ఈసారి ఏమైందంటే.. ?
నిబంధనలు కఠినంగా ఉంటాయి
జై షా మాట్లాడుతూ.. మేము ఆటగాళ్ల కోసం కొన్ని కఠినమైన నియమాలు తయారుచేశాం. రవీంద్ర జడేజా గాయపడినప్పుడు నేను అతనికి ఫోన్ చేసి దేశవాళీ క్రికెట్ ఆడమని అడిగాను. గాయం కారణంగా ఏ ఆటగాడు అయినా జట్టులోకి తిరిగి రావాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలనేది నియమంగా మారింది. దేశవాళీ క్రికెట్లో తమ ఫిట్నెస్ను నిరూపించుకున్నప్పుడే టీమ్ఇండియా టీమిండియాకు ఎంపిక చేస్తామని జై షా స్పష్టంగా తెలిపారు.
విరాట్, రోహిత్లకు ఎందుకు మినహాయింపు ఇచ్చారు?
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దులీప్ ట్రోఫీలో ఆడుతున్నట్లు వార్తలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే నివేదిక ప్రకారం ఈ ఇద్దరు సీనియర్ భారతీయ ఆటగాళ్లు రాబోయే టోర్నమెంట్లో ఆడటంలేదు. దీనిపై జై షా మాట్లాడుతూ.. విరాట్, రోహిత్లకు గాయాలయ్యే ప్రమాదం ఉందన్నారు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లతో జరగనున్న సిరీస్లను కూడా టీమ్ మేనేజ్మెంట్ దృష్టిలో ఉంచుకోని వారిద్దరికి మిహహాయింపు ఇచ్చిందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.